అన్వేషించండి

Delhi CM Kejriwal Arrest: అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్, ఈడీ కార్యాలయానికి తరలించిన అధికారులు

ED Arrests Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Delhi Liquor Policy Case: న్యూఢిల్లీ: న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు గురువారం రాత్రి ఏడు నుంచి 9 గంటల వరకు దాదాపు రెండు గంటలపాటు కేజ్రీవాల్ ను ఆయన నివాసంలోనే 2 గంటలపాటు విచారించిన అనంతరం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు ఇదివరకే 9 నోటీసులు ఇచ్చారు. సమన్లు జారీ చేసినా, కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొడుతూనే వస్తున్నారు. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ దూకుడుగా వ్యవహరించింది. హైకోర్టులో కేజ్రీవాల్ కు ప్రతికూల నిర్ణయం వెలువడగానే దాదాపు 8 మంది ఈడీ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్  ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టు అవుతారన్న ప్రచారంతో ఆప్ మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ సీఎం ఇంటికి చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కుట్రదారుడు అని ఈడీ అధికారులు ఆరోపించారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సహా మరికొందరితో కలిసి సౌత్ లాబీకి లాభం కలిగేలా కుట్ర చేశారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. రూ.100 కోట్ల మేర చేతులు మారాయని, త్వరలోనే దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయని ఈడీ చెబుతోంది.

కేజ్రీవాల్‌కి హైకోర్టు షాక్
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని కోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈడీ అరెస్ట్ నుంచి కేజ్రీవాల్ కు మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ఈ కేసులో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అయితే..ఈ పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించింది. ఏప్రిల్ 22వ తేదీన మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది. కానీ అంతలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సోదా చేస్తున్నారు.

గత ఏడాది కేజ్రీవాల్‌కు తొలిసారి సమన్లు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి నోటీసులు ఇచ్చింది. ఆపై డిసెంబర్‌లో రెండోసారి సమన్లు, జనవరి 3న విచారణకు హాజరు కావాలని మూడోసార్ ఆప్ అధినేతకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఈ నోటీసులను అంతగా పట్టించుకోలేదు. విచారణకు హాజరుకాలేదు. ఆపై జనవరి 13న నాలుగోసారి, ఫిబ్రవరి 2న కేజ్రీవాల్‌కు ఐదవసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. 

ఆపై ఫిబ్రవరి 19వ తేదీన 6వ సారి, విచారణకు హాజరు కావడం లేదని ఫిబ్రవరి 22న ఏడవసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. మార్చి 4న తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఈడీ 8వ నోటీసులు, తాజాగా 9వసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారులకు లైసెన్సులను మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని కార్టెలైజేషన్‌కు అనుమతించింది. అయితే అందుకోసం కొందరు డీలర్లు లంచాలు చెల్లించారని ఆరోపణలున్నాయి. ఆప్ ప్రభుత్వం ఈ ఆరోపణల్ని మొదట్నుంచీ ఖండిస్తూనే వచ్చింది. ఈ విషయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సేనా సిబిఐ విచారణకు సిఫారసు చేయగా.. ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget