అన్వేషించండి

Arvind Kejriwal: కోర్టులో అస్వస్థతకు గురైన దిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal Health Condition: దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు లోనయ్యారు. బుధవారం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

Delhi CM Arvind Kejriwal: దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు లోనయ్యారు. బుధవారం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కోర్టులో అస్వస్థతకు గురయ్యారు.  షుగర్ లెవల్ తగ్గడంతో ఆయన్ని మరో గదిలో కూర్చోబెట్టారు. టీ, బిస్కెట్లు అందజేశారు.   

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. అనంతరం దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది.  ఈ విచారణ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. అంతకుముందు, మార్చి 21న ఈడీ  కేజ్రీవాల్ ని మనీలాండరింగ్ కేసులో  అరెస్టు చేసింది. ఈడీ అరెస్టు చేసిన కేసులో బెయిల్ కు సంబంధించిన విచారణ సైతం ఈ రోజే సుప్రీం కోర్టులో జరుగనుంది.  ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది.  దీనిపై సైతం  సీఎం కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

దీనికి సంబంధించి వార్తా సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన వీడియోలో కేజ్రీవాల్ ను మరో గదికి తరలించడం కనిపించింది. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సైతం ఆయనతో పాటు  కనిపించారు.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షుగర్ (Diabetes) సమస్యతో బాధపడుతున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం నాడు తెలిపింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయాయని, ఇది ప్రమాదకరమైన పరిస్థితిని అని వైద్యులు చెబుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన భార్య సునితా కేజ్రీవాల్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను జైలులో మంగళవారం కలుసుకున్నానని, ఆయన శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని అన్నారు. అయితే ఆయన ధైర్యంగానే ఉన్నట్టు చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రజలంతా ప్రార్థించాలని కోరారు.

అరెస్టు బెయిలు.. లొంగుబాటు.. ఇదీ క్రమం.. 

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఎన్నికల కోసం మధ్యంతర బెయిల్ పై మే 10న బయటకి వచ్చిన ఆయన తిరిగి జూన్ రెండున లొంగిపోయారు. జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్న ఆయనను తాజాగా సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో భాగంగా కేజ్రీవాల్ రూ. వంద కోట్ల ముడుపులు డిమాండ్ చేసినట్లు ఈడీ ఆరోపించింది. అయితే ఈ కేసులో కేజ్రీవాల్ కు ఈ నెల 20 నే బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ లోని రూస్ ఎవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనిపై స్టే విధించాలని హైకోర్టుని ఈడీ కోరింది.  దీంతో ఆయన బెయిల్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అంతకుముందు 48 గంటల పాటు కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులను నిలిపివేయాలని రౌస్ ఎవెన్యూ కోర్టుని ఈడీ కోరింది. అయితే కోర్టు అందుకు అంగీకరించకపోవడతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. బుధవారమే దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగునున్న సమయంలో కేజ్రీవాల్ ను తాజాగా సీబీఐ అరెస్టు చేసింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget