అన్వేషించండి

Delhi Airport Fresh Advisory: ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ.. ఇవి పాటిస్తే నో ప్రాబ్లమ్

Delhi Airport operations issues travel advisory | విమాన ప్రయాణం చేసే వారికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ తాజాగా కొన్ని గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. వాటిని పాటించాలని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సూచించింది.

Delhi Airport | న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శనివారం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వం చేయగా.. డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన రిక్వెస్ట్ మేరకు ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం తరువాత సైతం ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. 

ఆదివారం తెల్లవారుజామున 2:42 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ విమాన ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దాని ప్రకారం, ఢిల్లీ విమానాశ్రయం కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. అయితే, మారుతున్న వాయుమార్గం వివరాలు, పౌర విమానయాన భద్రతా బ్యూరో ఆదేశించిన పెరిగిన భద్రతా ప్రోటోకాల్స్ దృష్ట్యా కొన్ని విషయాలు గమనించాలని సూచించింది. విమాన ప్రయాణ సమయాలలో సర్దుబాట్లు, భద్రతా తనిఖీల (Security Checking) వద్ద ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉండవచ్చు అని తెలిపింది.

ఎయిర్ లైన్స్ ఇచ్చే గైడ్‌లైన్స్ పాటించాలి..

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఇటీవల దేశంలోని కొన్ని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసి, సర్వీసులు సైతం రద్దు చేయడం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన శనివారం సాయంత్రం చేయగా.. ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికుల సౌకర్యార్థం ఆదివారం తెల్లవారుజామున ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసింది. ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థల కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా అప్‌డేట్ అవ్వాలి. క్యాబిన్, చెక్-ఇన్ బ్యాగేజీకి నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి. చెకింగ్ కారణంగా మరింత సమయం వేచి ఉండాల్సి వస్తుంది కనుక మరికాస్త ముందుగానే ఢిల్లి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. విమానయాన, భద్రతా సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని, విమానయాన సంస్థ లేదా అధికారిక ఢిల్లీ విమానాశ్రయ వెబ్‌సైట్ ద్వారా విమానం ప్రస్తుత స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక సమాచారం, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఎయిర్ లైన్స్ ఇచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను పట్టించుకోకూడదని సలహా ఇచ్చింది. 

శనివారం రాత్రి 8:25 నుండి 8:45 గంటల వరకు పూణే విమానాశ్రయంలో అత్యవసర పవర్ షట్‌డౌన్ డ్రిల్ నిర్వహించారు. విమానాశ్రయంలో సన్నద్ధత, పవర్ కట్, ఇతర అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందన కోసం చెక్ చేయడమే ఈ డ్రిల్ లక్ష్యం. ఆ సమయంలో వచ్చిన విమానాలు 20-30 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. 

మే 15 వరకు విమానాశ్రయాల తాత్కాలిక మూసివేత

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా మే 15 ఉదయం వరకు 32 విమానాశ్రయాలు మూసివేస్తారు. భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI), విమానయాన అధికారులు, ఉత్తర భారత్, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు నోటీసులను జారీ చేశారు. ఆపరేషనల్ కారణాలతో మే 9 నుండి మే 14, 2025 వరకు NOTAM అమలులో ఉంటుంది.

32 విమానాశ్రయాల జాబితాలో అమృత్‌సర్, అవంతిపూర్, బాటిండా, ఉధంపూర్, జోధ్‌పూర్, అంబాలా, భుజ్, బికనెర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, పఠాన్‌కోట్, పటియాలా, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కెషోద్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూధియానా, ముండ్రా, నాలియా, శ్రీనగర్, థోయిస్, పోర్బందర్, రాజ్‌కోట్ (హిరసర్), సర్సావా, షిమ్లా మరియు ఉత్తర్లై ఉన్నాయి.

బారముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్‌లతో దాడికి యత్నించగా భారత బలగాలు వాటిన గాల్లోనే పేల్చేవేసి, నిర్వీర్యం చేశాయని రక్షణ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ (LoC) వద్ద పాక్ సైన్యం దాడులు చేసింది.

 శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, బారముల్లా, జమ్మూ, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, ఫజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, భుజ్, బార్మెర్,  కువార్బెట్, లాఖీ నాలా ఏరియాలో పాక్ డ్రోన్ దాడులు చేయగా భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget