అన్వేషించండి

Covid-19 Review Meeting: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు

PM Modi Meeting on Covid 19: దేశంలో కరోనా స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సైతం సూచించారు.

PM Modi Holds High Level Meeting To Review Coronavirus Situation: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు కొత్త ఇన్ ఫ్లూయెంజ వైరస్ ల వ్యాప్తితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (మార్చి 22న) దేశంలో కరోనా స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కరోనా వ్యాప్తి, హెచ్‌ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులపై చర్చించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి మోదీ, దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సైతం సూచించారు. 

ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో పెరుగుతున్న కేసులపై ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారని పిటిఐ రిపోర్ట్ చేసింది. ఇన్‌ఫ్లుయెంజా పరిస్థితిపై, ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దేశంలో నమోదవుతున్న హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. అయితే మూడేళ్ల కిందట 2020 తరహాలోనే ప్రజలు శ్వాస వ్యవస్థకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, దేశంలో 1,134 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మొత్తంగా 7,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పీఎంఓ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. గత 24 గంటల్లో దేశంలో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కోవిడ్ -19 మరణాల సంఖ్య 5,30,813 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చనిపోయారు. కోవిడ్-19 కేసుల పెరగడంతో, కేరళ ప్రభుత్వం అన్ని జిల్లాలకు మధ్యంతర హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా కేసుల చికిత్స కోసం కేంద్రం ఇటీవల సవరించిన మార్గదర్శకాల ప్రకారం, ప్లాస్మా థెరపీని ఉపయోగించవద్దని వైద్యులకు సూచించింది. లోపినావిర్ - రిటోనావిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, మోల్నుపిరావిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్ తో పాటు డాక్సీసైక్లిన్ మెడిసిన్ ను వయోజనులకు కోవిడ్-19 చికిత్సలో భాగంగా వినియోగించకూడదని మార్గదర్శకాలలో పేర్కొంది. ఇన్ ఫెక్షన్ సోకిందని నిర్ధారణ అయితేనే యాంటీ బయాటిక్స్ వాడాలని సూచించింది. శ్వాస సమస్య తలెత్తితే మాత్రం సీరియస్ గా తీసుకోవాలని, 5 రోజులపాటు జ్వరం అలాగే ఉండి తగ్గకపోయినా వైద్యులు జాగ్రత్తగా ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలలో కేంద్ర వైద్యశాఖ పేర్కొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులుకర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Best Safety Cars in India: రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Embed widget