అన్వేషించండి

Covid-19 Review Meeting: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు

PM Modi Meeting on Covid 19: దేశంలో కరోనా స్థితిగతులపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సైతం సూచించారు.

PM Modi Holds High Level Meeting To Review Coronavirus Situation: దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు కొత్త ఇన్ ఫ్లూయెంజ వైరస్ ల వ్యాప్తితో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (మార్చి 22న) దేశంలో కరోనా స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కరోనా వ్యాప్తి, హెచ్‌ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులపై చర్చించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి మోదీ, దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సైతం సూచించారు. 

ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో పెరుగుతున్న కేసులపై ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారని పిటిఐ రిపోర్ట్ చేసింది. ఇన్‌ఫ్లుయెంజా పరిస్థితిపై, ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దేశంలో నమోదవుతున్న హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. అయితే మూడేళ్ల కిందట 2020 తరహాలోనే ప్రజలు శ్వాస వ్యవస్థకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం, దేశంలో 1,134 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, మొత్తంగా 7,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పీఎంఓ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు. గత 24 గంటల్లో దేశంలో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కోవిడ్ -19 మరణాల సంఖ్య 5,30,813 కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చనిపోయారు. కోవిడ్-19 కేసుల పెరగడంతో, కేరళ ప్రభుత్వం అన్ని జిల్లాలకు మధ్యంతర హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా కేసుల చికిత్స కోసం కేంద్రం ఇటీవల సవరించిన మార్గదర్శకాల ప్రకారం, ప్లాస్మా థెరపీని ఉపయోగించవద్దని వైద్యులకు సూచించింది. లోపినావిర్ - రిటోనావిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, మోల్నుపిరావిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్ తో పాటు డాక్సీసైక్లిన్ మెడిసిన్ ను వయోజనులకు కోవిడ్-19 చికిత్సలో భాగంగా వినియోగించకూడదని మార్గదర్శకాలలో పేర్కొంది. ఇన్ ఫెక్షన్ సోకిందని నిర్ధారణ అయితేనే యాంటీ బయాటిక్స్ వాడాలని సూచించింది. శ్వాస సమస్య తలెత్తితే మాత్రం సీరియస్ గా తీసుకోవాలని, 5 రోజులపాటు జ్వరం అలాగే ఉండి తగ్గకపోయినా వైద్యులు జాగ్రత్తగా ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలలో కేంద్ర వైద్యశాఖ పేర్కొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
AP DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Robinhood First Review: 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ... ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషనల్... టాక్ ఎలా ఉందంటే?
Robinhood Movie: నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
నితిన్ 'రాబిన్ హుడ్' టికెట్ ధరల పెంపు - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మూవీ టీం.. అసలు నిజం ఏంటో తెలుసా?
Telugu Travellar: ప్రపంచంలో ఈ 280 మంది ప్రత్యేకం  - వీరిలో మన రవి ఒకరు - ఇంతకీ ఏం చేశాడో తెలాసా ?
ప్రపంచంలో ఈ 280 మంది ప్రత్యేకం - వీరిలో మన రవి ఒకరు - ఇంతకీ ఏం చేశాడో తెలాసా ?
Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు - ఐలవ్‌యూ డేవిడ్ వార్నర్ అంటూ..
డేవిడ్ వార్నర్‌కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు - ఐలవ్‌యూ డేవిడ్ వార్నర్ అంటూ..
Embed widget