అన్వేషించండి

Rahul Gandhi Nonbailable Warrant: రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ, వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు

Rahul Gandhi News | లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు షాకిచ్చింది. పరువునష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

రాంచీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సైతం కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు లాయర్ చేసిన విజ్ఞప్తిని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు తిరస్కరించింది.

బీజేపీ నేత ప్రతాప్ కటియార్ ఈ పరువునష్టం దావా వేశారు. 2018లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పరువునష్టం దావే వేశారు ప్రతాప్ కటియార్. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం బీజేపీ అధ్యక్షుడు కావొచ్చని తన ప్రసంగంలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలై ఝార్ఖండ్ బీజేపీ నేతలతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని.. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందర్నీ అవమానించారని ఆరోపిస్తూ, ప్రతాప్ కటియార్ జూలై 9, 2018న చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు వచ్చే నెలలో కాంగ్రెస్ ఎంపీ వ్యక్తిగతం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతో, రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. తర్వాత, కేసును చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లింది. అక్కడ మేజిస్ట్రేట్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌కు సమన్లు ​​జారీ చేశారు.

కోర్టు పదే పదే సమన్లు ​​జారీ చేసినప్పటికీ, రాహుల్ గాంధీ విచారణకు హాజరుకాని కారణంగా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత, వారెంట్‌పై స్టే కోరుతూ రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మార్చి 20, 2024న విచారణకు రాగా కోర్టు కొట్టివేసింది. తరువాత, వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోసం రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను చైబాసా కోర్టు కూడా తోసిపుచ్చింది. తాజాగా ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget