News
News
X

Congress On ED Raids: 8 ఏళ్లలో 3వేల ఈడీ దాడులు, ప్రతిపక్షాలే లక్ష్యం: కాంగ్రెస్

Congress On ED Raids: విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుధమై ఈడీ అని కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా అభివర్ణించారు. 8 ఏళ్లలో 3వేల ఈడీ దాడులు జరగ్గా.. అవన్నీ ప్రతిపక్ష నేతలపైనేనని తెలిపారు.

FOLLOW US: 
Share:

Congress On ED Raids: ఛత్తీస్ గఢ్ లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఈడీ దాడులు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు ఇతర ప్రాంతాలో సోదాలు చేయడాన్ని ఆ పార్టీ నేతలు పగకు, వేధింపులకు నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ విమర్శించారు. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పుర్ లో ఫిబ్రవరి 24 - 26 వరకు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ముందు ఈడీ దాడులు జరగడాన్ని కక్షపూరిత చర్యలుగా జైరామ్ రమేష్ పేర్కొన్నారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈడీ కేవలం 112 దాడులు నిర్వహించగా.. బీజేపీ అధికారంలో ఉన్న 8 ఏళ్లలో ఏకంగా 3010 దాడులు జరిగాయని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తెలిపారు. 

95 శాతం దాడులు ప్రతిపక్షాలపైనే

3 వేల పైచిలుకు ఈడీ దాడుల్లో 95 శాతానికి పైగా ప్రతిపక్ష నేతలపైనే జరిగాయని పవన్ ఖేరా అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలను ప్రశ్నించారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సమావేశాలు జరగబోతున్నందున ఛత్తీస్ గఢ్ లో ఈడీ దాడులు మొదలయ్యాయని అన్నారు. ఇప్పుడు ఈడీ అంటే ఎలిమినేటింగ్ డెమోక్రసీ అని ఆయన అభివర్ణించారు. 

ఏ పార్టీపై ఎన్ని దాడులు జరిగాయంటే..

2014 నుండి ప్రతిపక్ష పార్టీలపై ఈడీ దాడులు జరిపిన గణాంకాలను కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. కాంగ్రెస్ నేతలపై 24, టీఎంసీ నేతలపై 19, ఎన్సీపీపై 11, శివసేనపై 8, డీఎంకే పై 6, ఆర్జేడీపై 5, పీడీపీపై 5, ఐఎన్ఎల్డీపై 3, వైఎస్సార్సీపీపై 2, సీపీఎంపై 2, నేషనల్ కాన్ఫరెన్స్ పై 2, పీడీపీపై 2, అన్నా డీఎంకేపై 1, ఎంఎన్ఎస్ పై 1, ఎస్బీఎస్పీపై 1 సారి చొప్పున దాడులు నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ నేతలు రామ్ గోపాల్ అగర్వాల్, దేవేంద్ర యాదవ్, గిరీష్ దేవాంగన్, ఆర్పీ సింగ్, వినోద్ తివారీ, సన్నీ అగర్వాల్ లపై ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు పవన్ ఖేరా వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని తెలిపారు.

"హిమంత బిస్వా శర్మ, సుబేందు అధికారిపై సమాధానం చెప్పండి"

ఈడీ రైడ్ ను ప్రశ్నిస్తూ హిమంత బిస్వా శర్మకు వ్యతిరేకంగా బీజేపీ చాలా పేపర్లను చూపించిందని, కానీ ఆయన క్లీన్ అండ్ క్లీన్ గా బయటకు వచ్చారని అన్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సుబేందు అధికారి, కర్ణాటకకు చెందిన బీఎస్ యడ్యూరప్ప, రెడ్డి బ్రదర్స్, నారాయణ్ రాణే, ముకుల్ రాయ్ వంటి పేర్లను కాంగ్రెస్ నాయకలు వెల్లడించారు. 

"ప్రధాని మోదీకి ఈడీ ఆయుధంగా మారింది"

ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ప్రతిపక్షాలకు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయుధంగా మారిందని జైరాం రమేష్ అన్నారు. ఈడీ నిష్పక్షపాతంగా పని చేయడం లేదని తెలిపారు. అదే సమయంలో ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ చేసిన దాడుల్లో 95 శాతం ప్రతిపక్షాలపై చేశాయని తెలిపారు. కాంగ్రెస్ ప్లీనరీ మీటింగ్ కు ముందు ఈడీ దాడులు చేయడం ప్రధాని మోదీ పిరికితనానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

Published at : 20 Feb 2023 03:04 PM (IST) Tags: PM Modi Government Chhattisgarh ED Raids Congress On ED Raids Jairam Ramesh Pawan Khera ED Raids on Oppositions

సంబంధిత కథనాలు

Covid-19 Review Meeting: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు

Covid-19 Review Meeting: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!

Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!