అన్వేషించండి

లోక్‌స‌భ స్పీకర్‌పై అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టే యోచ‌న‌లో కాంగ్రెస్-విప‌క్షాల‌తో మంత‌నాలు

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీపై ఏకపక్షంగా అన‌ర్హ‌త వేటు వేశారని ఆరోపిస్తూ లోక్‌స‌భ స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు ఆ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది.

No-confidence Motion : రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు తెలుపుతూ అధికార బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్‌గాంధీపై వేటు వేశారంటూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ఎంపీలంతా మంగళవారం ఉదయం సమావేశమై ఈ విష‌యంపై చ‌ర్చించారు.

ఏప్రిల్ 3న అవిశ్వాసం?
ఏప్రిల్ 6వ తేదీన  పార్లమెంట్‌ సమావేశాలు ముగుస్తాయి. ఈ లోగా ప్రాంతీయ పార్టీలతో కలిసి స్పీకర్‌పై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచన చేస్తోంది. ఏప్రిల్ 3వ తేదీన స‌భ‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరనుంది. 

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఈ నెల 23న  రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువ‌రించింది. ఈ విషయమై అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజే లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.  ఈ చర్యను తప్పుపడుతూ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు బీజేపీయేతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ క్ర‌మంలోనే సోమవారం కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ త‌దిత‌ర‌ ప్రాంతీయపార్టీలు పాల్గొని మ‌ద్ద‌తు ఇచ్చాయి. అనంతరం రాహుల్ గాంధీ అనర్హత వేటు, అదానీ అంశంపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్ నేపథ్యంలో లోక్‌సభలో అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ప్రతిప‌క్ష‌ పార్టీల నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్‌సీపీ, బీఆర్ఎస్‌, వామపక్ష పార్టీలు సహా ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు హాజరయ్యారు.

2024 ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీకి ప్ర‌య‌త్నాలు
వీరంతా కలిసి పార్లమెంట్‌లో ప్రభుత్వంపై పోరాడడమే కాక.. ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం), సమాజ్‌వాదీ, బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం, ఆప్‌, జేడీయూ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్‌, ఆర్‌ఎస్పీ, ఆర్జేడీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఐయూఎంఎల్‌, వీసీకే, జేఎంఎం పార్టీల మధ్య ఇప్పటికే కీలక చర్చలు సాగుతున్నాయి. సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన విందు సమావేశంలో శివసేన తప్ప మిగతా పార్టీలన్నీ హాజరయ్యాయి. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ఉద్యమంలో పాల్గొంటామ‌ని శివసేన కూడా ప్రకటించింది. తాము చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి 19 పార్టీల మద్దతు లభించిందని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ తెలిపారు.

రాహుల్‌ కేసులో అప్పీల్‌పై తమ లీగల్‌ టీమ్‌ పనిచేస్తోందని తెలిపారు. శివసేనతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకుంటామని.. ఆ పార్టీ మద్దతు కూడా తమకు ఉందని జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. కాగా, రాహుల్‌పై వేటు నేపథ్యంలో ఏకతాటిపైకి వచ్చిన విపక్షాల ఐక్యతను 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ కొనసాగించేలా ప్రతిపక్ష పార్టీల అధినేతలతో ఏప్రిల్‌లో భేటీ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. 

నెల‌రోజుల‌పాటు నిర‌స‌న‌లు
రాహుల్‌పై అనర్హత, అదానీ అంశాలపై.. ‘జై భారత్‌ మహా సత్యాగ్రహ’, ‘లోక్‌తంత్ర బచావో మషాల్‌ శాంతి మార్చ్‌ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కాగడాలతో చేసే శాంతి ర్యాలీ) .. ఇలా పలు రకాల నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నెల రోజులపాటు చేపడ‌తామ‌ని కాంగ్రెస్‌ ప్రకటించింది. ‘జై భారత్‌ మహా సత్యాగ్రహ’లో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని బ్లాక్‌/మండల స్థాయి కాంగ్రెస్‌ విభాగాలూ ‘వీధి సమావేశాలు’ నిర్వహించి అదానీ విషయంలో మోదీ సర్కారు తీరు గురించి, రాహుల్‌పై అనర్హత వేటు గురించి ప్రజలకు తెలుపుతారని వెల్లడించింది. మార్చి 31న అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రస్థాయి కాంగ్రెస్‌ నేతలు, ఏప్రిల్‌ 1న అన్ని బ్లాక్‌లు/మండలాల్లో జిల్లా స్థాయి నేతలు పత్రికా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపింది. ఏప్రిల్‌ 3న అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ కాంగ్రెస్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలు గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారని వివరించింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి యువ కాంగ్రెస్‌ నేతలు, ఎన్ఎస్‌యూఐ కలిసి ప్రధాని మోదీకి ప్రశ్న‌లు సంధిస్తూ పోస్టు కార్డులు పంపుతారని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఏప్రిల్‌ 15 నుంచి 20 దాకా జిల్లా స్థాయిలో జై భారత్‌ సత్యాగ్రహ కార్యక్రమాన్ని కలెక్టరేట్ల వద్ద నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే జై భారత్‌ సత్యాగ్రహ కార్యక్రమంలో భాగంగా.. పార్టీ సీనియర్‌ నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తారని తెలిపారు. ఏప్రిల్‌ రెండో వారంలో ఢిల్లీలో జై భారత్‌ మహా సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
Narendra Modi Longest Serving Elected Prime Minister: చారిత్రాత్మక రికార్డుకు అడుగు దూరంలో మోదీ - జూన్ 9న నెహ్రూ రికార్డు బ్రేక్.. సుదీర్ఘకాలం ఎన్నికైన’ ప్రధానిగా సరికొత్త చరిత్ర!
చారిత్రాత్మక రికార్డుకు అడుగు దూరంలో మోదీ - జూన్ 9న నెహ్రూ రికార్డు బ్రేక్.. సుదీర్ఘకాలం ఎన్నికైన’ ప్రధానిగా సరికొత్త చరిత్ర!
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget