అన్వేషించండి

Congress Chintan Shivir: ఈవీఎంల రద్దు, కుటుంబానికి ఒక్క టికెట్‌, 5 ఏళ్లు ఛాన్స్ - చింతన శిబిరంలో మరిన్ని కీలక నిర్ణయాలివే

Congress Chintan Shivir: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై చర్చ జరగగా, తాము అధికారంలోకి వస్తే ఈవీఎంలను రద్దు చేసి, పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది.

Know Key decisions by Congress during 3-day Chintan Shivir: కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే లక్ష్యంలో భాగంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిరం పేరుతో నిర్వహించిన సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చివరి రోజు సమావేశాల్లో భాగంగా ఎన్నికల్లో ఓటములపై చర్చించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. 

సీడబ్ల్యూసీ చింతన శిబిరం సమావేశంలో పార్టీ వ్యూహాలు, ఓటములకు సంబంధించిన రిపోర్ట్, సరికొత్త నిర్ణయాలపై ఆరు ప్యానెల్స్ అందించిన వివరాలకు ఆమోదం తెలిపారు. భావజాల, ఆర్థిక పాలసీలు, సామాజిక అంశాలను సైతం పార్టీ నేతలు చర్చించారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం తెగిపోయిందని, దీన్ని తిరిగి గాడిన పెట్టాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు. ప్రజలతో మమేకం కావాలని, వారి ఆకాంక్షలు తెలుసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై చర్చ జరగగా, తాము అధికారంలోకి వస్తే ఈవీఎంలను రద్దు చేసి, పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. 20 ప్రతిపాదనలతో పాటు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యాత్రను చేపట్టనున్నట్లుగా ఆదివారం (మే 15) తెలిపారు. దీని పేరు భారత్ జోడో యాత్ర అని తెలిపారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ చింతన్ శిబిరం (Congress Chintan Shivir) చివరి రోజున పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొని అభిప్రాయాన్ని తెలిపిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

చింతన్ శిబిరంలో సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలివే..
ఒక్క కుటుంబం, ఒక్కటే టికెట్‌పై ఏకాభిప్రాయం కుదరింది. అయిదేళ్లు పనిచేసిన అనుభం ఉన్న నేతలు తమ కుటుంబసభ్యులకుగానీ, బందువులకు గానీ తమ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది

ఎవరైనా ఓ పదవిలో 5 ఏళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగకూడదని, కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని సీడబ్ల్యూసీ నిర్ణయం

50 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పార్టీలోని అన్ని స్థాయిలలో 50 శాతం పదవులు, అవకాశాలు కల్పించడం

కాంగ్రెస్ పార్టీ రైతులకు కనీస మద్దతు ధర, నిరుద్యోగిత సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయం

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు, మైనార్టీలకు కలిపి పార్టీలోని అన్ని స్థాయిలలో 50 శాతం అవకాశాలు కల్పించాలి. అణగారిన వర్గాలు, మైనార్టీలలో పార్టీపై నమ్మకం పెంపొందించడానికి చర్యలు

ప్రతి స్థాయిలోనూ పార్టీ నేతల ప్రదర్శనను పరిశీలించేందుకు అంచనా విభాగం ఏర్పాటు ఏర్పాటుకు సీడబ్ల్యూసీ నిర్ణయం

ప్రజల సమస్యలు, ఎలక్షన్ మేనేజ్ మెంట్, జాతీయ స్థాయిలో శిక్షణకు విభాగం ఇలా కాంగ్రెస్‌లో మూడు కొత్త విభాగాలకు ప్రతిపాదన. ఖాళీగా స్థానాలు, పోస్టులను 90 నుంచి 120 రోజుల్లో భర్తీ చేయడం

దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహణ. అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయం

జూన్ 15 నుంచి రెండో దశ జన్ జాగరణ యాత్రను జిల్లా స్థాయిలో ప్రారంభించాలని నిర్ణయం

రాజకీయంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, చర్చల కోసం సీడబ్ల్యూసీ నుంచే సలహా గ్రూప్ ఏర్పాటు  చేయడం

పార్టీలో సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ అధ్యక్షులకు సహాయం చేసేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు నిర్ణయం

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈవీంఎలకు స్వస్తి పలికి, తిరిగి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహణకు ఆమోదం

ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించడం, 70 ఏళ్లు దాటిన వారు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై చర్చలు జరిగాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget