అన్వేషించండి

Collegium vs NJAC: కొలీజియం వ్యవస్థ రద్దు కానుందా? సుప్రీంకోర్టుకు, మోదీ ప్రభుత్వానికి మధ్య ఈ వివాదం ఎందుకు ?

Collegium vs NJAC: న్యాయమూర్తులపై పేర్లపై కేంద్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను కొలీజియానికి చెప్పవచ్చు. అయితే కొలీజియం మళ్లీ ఆ పేర్లను ప్రభుత్వానికి పంపితే మాత్రం ఆమోదించక తప్పదు.

Collegium vs NJAC: భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఇది పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు. 

కేంద్రమంత్రి రాసిన లేఖపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఇది ప్రమాదకరమని, న్యాయ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. అదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్న కొలీజియం వ్యవస్థను కొనసాగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తోంది. ఇంతకీ ఇప్పుడున్న వ్యవస్థను కేంద్రం ఎందుకు వద్దంటోంది... సుప్రీంకోర్టు కొలీజియం ఎలా పనిచేస్తుందో చూద్దాం.

కొలీజియం వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

దేశంలో 1993 నుంచి న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం విధానం అమల్లో ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఈ కొలీజియం వ్యవస్థలో భాగంగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీలను కేంద్ర ప్రభుత్వానికి ఈ కొలీజియం సిఫార్సు చేస్తుంది. అదే సమయంలో హైకోర్టు కొలీజియంలో సీజేఐతోపాటు హైకోర్టుకు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగంలో మార్గదర్శకాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల వల్ల ఏర్పడిన వ్యవస్థ ఇది. కొలీజియం వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అలాంటి పాత్ర ఉందని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కావడానికి ఒక న్యాయవాది పేరును సూచిస్తే... ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆ న్యాయవాది గురించి సమాచారాన్ని తీసుకోవచ్చు. ఈ పేర్లపై కేంద్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను కొలీజియం ముందు ఉంచవచ్చు. వివరణలు కోరవచ్చు. అయితే కొలీజియం మళ్లీ ఆ పేర్లను ప్రభుత్వానికి పంపితే మాత్రం ప్రభుత్వం వాటిని ఆమోదించక తప్పదు. న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో న్యాయమూర్తులను నియమిస్తారు.

కొలీజియం సమస్య ఏమిటి?

2021 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సర్వీసు నిబంధనలు) సవరణ బిల్లు 2021పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేరళ ఎంపీ జాన్ బ్రిటాస్ న్యాయవ్యవస్థలోని లోపాల గురించి బహిరంగంగా మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకం, న్యాయవ్యవస్థలో వంశపారంపర్యం, కొలీజియం ప్రతిపాదనలపై ప్రభుత్వ మౌనం, న్యాయవ్యవస్థలో వైవిధ్యం లేకపోవడం వంటి అంశాలను రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్ లేవనెత్తారు. 1980 వరకు దేశ సుప్రీంకోర్టులో ఓబీసీ జడ్జిలు లేరని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. కొలీజియం వ్యవస్థలో నిర్ణయాలు ఎలా, ఎప్పుడు తీసుకుంటారనే దానిపై సిఫారసు ప్రభుత్వానికి చేరే ముందు ఎలాంటి సమాచారం బయటకు రాదన్నారు. 

నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే ఏమిటి?

2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ఇందులో కొలీజియం వ్యవస్థను తొలగించి న్యాయమూర్తులను నియమించేందుకు ఈ కమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఈ కమిషన్ నేరుగా పెంచుతుంది. వాస్తవానికి సీజేఐ నేతృత్వంలోని ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి, పౌర సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులను చేర్చుకునే వెసులుబాటు నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌లో ఉంది. ఇద్దరు నామినేటెడ్ సభ్యుల్లో ఒకరిని సీజేఐ, ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా నియమిస్తారు. అదే సమయంలో రెండో నామినేటెడ్ సభ్యుడు ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ మైనారిటీ కమ్యూనిటీ లేదా మహిళలు ఉంటారు. 2015లో సుప్రీంకోర్టు ఎన్‌జేఏసీ చట్టవిరుద్ధమని ప్రకటించింది.

కొలీజియం వ్యవస్థను రద్దు చేయవచ్చా?

కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పార్లమెంటు, లోక్ సభ, రాజ్యసభ ఉభయ సభల్లో జరిగే ఓటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండొంతుల ఎంపీల మెజారిటీ రావాలి. దీనితో పాటు ఈ సవరణకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల మద్దతు కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదని చెప్పవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.