అన్వేషించండి

Indo-China Relations: గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి భారత్ లో చైనా విదేశాంగ మంత్రి, రేపు జైశంకర్ తో భేటీ!

Indo-China Relations: గల్వాన్ వివాదం తర్వాత తొలిసారి చైనా విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన విదేశాంగ మంత్రి జై శంకర్ ను కలవనున్నారు.

Indo-China Relations: 2020 మే నెలలో భారత్, చైనా మధ్య తూర్పు లడఖ్ ప్రాంతంలో వివాదం నెలకొన్న తర్వాత తొలిసారి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం సాయంత్రం భారతదేశానికి వచ్చాయి. యీ రేపు ఉదయం 11 గంటలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్‌లను కలిసే అవకాశం ఉందని ANI  తెలిపింది. వాంగ్ యీ కాబూల్ నుంచి న్యూదిల్లీకి వచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి ఉప ఖండపు దేశాల్లో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్కోకు చైనా ఆర్థికంగా సాయం అందిస్తుందని యూఎస్ సహా యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదని విశ్లేషణకులు అంటున్నారు. 

లడఖ్ ఉద్రిక్తల తగ్గించేందుకు ఇరు విదేశాంగ మంత్రుల భేటీ

PTI ప్రకారం వాంగ్ యీ భారత్ పర్యటన ప్రతిపాదన చైనా వైపు నుంచి వచ్చిందని తెలుస్తోంది. వాంగ్ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు కూడా వెళ్లనున్నారు. ఏడాదిన్నత క్రింత తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించడానికి జైశంకర్, వాంగ్ యీ మాస్కో, దుషాన్‌బేలో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. సెప్టెంబరు 2020లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మేళనం సందర్భంగా జైశంకర్, వాంగ్ మాస్కోలో విస్తృతమైన చర్చలు జరిపారు. ఈ సమయంలో వారు తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం పరిష్కరించడానికి ఐదు పాయింట్ల ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందంలో ఇరు దేశాల దళాలను త్వరగా ఉపసంహరించుకోవడం, ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించడం, సరిహద్దు నిర్వహణపై అన్ని ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటం, LAC వెంట శాంతిని పునరుద్ధరించే చర్యలు వంటి చర్యలు ఉన్నాయి. గత ఏడాది జులైలో తజికిస్థాన్ రాజధాని దుషాన్‌బేలో సరిహద్దు వివాదంపై ఇద్దరు విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు. మళ్లీ సెప్టెంబర్‌లో దుషాన్‌బేలోనే చర్చలు జరిపారు. 

ఇరువైపులా 60 వేల మంది సైనికులు 

ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి వాస్తవాధిన రేఖ (LAC) వెంబడి శాంతి కీలకమని భారత్ గట్టిగా నమ్ముతోందని విదేశాంగశాఖ తెలిపింది. మార్చి 11న, తూర్పు లడఖ్ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం, చైనా 15వ రౌండ్ ఉన్నత స్థాయి సైనిక చర్చలు నిర్వహించాయి. మే 5, 2020న పాంగ్ యాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్ చైనా మిలిటరీల మధ్య తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరుపక్షాలు పదివేల మంది సైనికులతో పాటు భారీ ఆయుధాలు మోహరించాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా, పాంగ్ యాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, గోగ్రా ప్రాంతంలో సైనికులను వెనక్కి పిలిచాయి రెండు దేశాలు. సున్నితమైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి ప్రస్తుతం 50,000 నుంచి 60,000 మంది సైనికులు ఉన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Warning Bells:  వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
Revanth Chitchat: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
MLC Election Voting Procedure : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
Euphoria Making Video: గుణశేఖర్, భూమిక 'యుఫోరియా' మూవీ షూటింగ్ పూర్తి - మేకింగ్ వీడియో చూశారా?
గుణశేఖర్, భూమిక 'యుఫోరియా' మూవీ షూటింగ్ పూర్తి - మేకింగ్ వీడియో చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GV Reddy Resign Controversy | GV రెడ్డి రాజీనామాతోనైనా చంద్రబాబులో మార్పు వస్తుందా.? | ABP DesamAP Deputy CM Pawan Kalyan Speech | మొఘలులు ఓడించారనేది మన చరిత్ర అయిపోయింది | ABP DesamPastor Ajay Babu Sensational Interview | యేసును తిడుతున్నారు..అందుకే హిందువులపై మాట్లాడుతున్నాం |ABPAdani Speech Advantage Assam 2.0 | అడ్వాంటేజ్ అసోం 2.0 సమ్మిట్ లో అదానీ సంచలన ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Warning Bells:  వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయా బాబుగారూ..?
Revanth Chitchat: 3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
3 అనుమానాస్పద మరణాలకు కేటీఆర్‌కు లింకేంటి ? - ఢిల్లీలో సీఎం రేవంత్ చిట్ చాట్
MLC Election Voting Procedure : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
Euphoria Making Video: గుణశేఖర్, భూమిక 'యుఫోరియా' మూవీ షూటింగ్ పూర్తి - మేకింగ్ వీడియో చూశారా?
గుణశేఖర్, భూమిక 'యుఫోరియా' మూవీ షూటింగ్ పూర్తి - మేకింగ్ వీడియో చూశారా?
US Gold Card : పౌరసత్వానికి రేటు కట్టిన ట్రంప్ - అమెరికాను ఇలా దిగజార్చుతారని ఎవరైనా అనుకుంటారా?
పౌరసత్వానికి రేటు కట్టిన ట్రంప్ - అమెరికాను ఇలా దిగజార్చుతారని ఎవరైనా అనుకుంటారా?
Indiramma Atmiya Bharosa Amount: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, వారి ఖాతాల్లో రూ.6 వేలు చొప్పున జమ
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, వారి ఖాతాల్లో రూ.6 వేలు చొప్పున జమ
Ration Cards EKYC Update News: ఏపీ, తెలంగాణలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- మార్చి 31 తర్వాత సేవలు ఆగిపోవచ్చు!
ఏపీ, తెలంగాణలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- మార్చి 31 తర్వాత సేవలు ఆగిపోవచ్చు!
Kannappa Teaser Release Date: కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన విష్ణు మంచు
కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన విష్ణు మంచు
Embed widget