By: ABP Desam | Updated at : 25 Mar 2022 02:47 PM (IST)
Edited By: Murali Krishna
అలా అని ఇలా భేటీ- జైశంకర్తో చైనా విదేశాంగ మంత్రి చర్చ
చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు, దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో జై శంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. గల్వాన్ ఘటన తర్వాత అత్యున్నత స్థాయి చైనా నేత భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Talks with Chinese FM Wang Yi have concluded.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 25, 2022
Will be addressing the media very soon. pic.twitter.com/x8gEgcJLh6
కీలక చర్చ
ఇరు దేశాల సరిహద్దు సమస్యలు, ఉక్రెయిన్పై రష్యా దాడి వంటి అంశాలపై వాంగ్ యూ, జైశంకర్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అఫ్గానిస్థాన్ పరిస్థితిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్ రాకముందు వాంగ్ యీ మూడు రోజుల పాటు పాకిస్థాన్లో పర్యటించి తర్వాత అఫ్గానిస్థాన్ కాబూల్ వెళ్లారు. గురువారం సాయంత్రం వాంగ్ యీ దిల్లీ చేరుకున్నారు.
వాస్తవాదీన రేఖ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో కొనసాగించాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీను కోరారు అజిత్ డోభాల్. దౌత్య, సైనిక స్థాయిలో సానుకూల చర్చల ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు చేపట్టే చర్యలు సమాన, పరస్పర భద్రతా స్ఫూర్తిని ఉల్లంఘించకుండా చూసుకోవాలని దిల్లీలో జరిగిన భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్పై వాంగ్ యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో మంగళవారం ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో వాంగ్ యీ జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సులో పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయని చైనా కూడా అదే కోరుకుంటోందని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలను భారత్ తప్పబట్టింది. జమ్ముకశ్మీర్కు సంబంధించిన విషయాలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాలని, చైనాతో సహా ఇతర దేశాలకు మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. భారత్ తమ అంతర్గత సమస్యలపై ఇతరుల జోక్యం కోరదని గ్రహించాలని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేపట్టడం విశేషం.
Also Read: Zomato Instant Delivery: జొమాటోకు పోలీసుల షాక్- 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీపై సీరియస్
Also Read: Birbhum Violence Case: బంగాల్ హింసాకాండపై సీబీఐ దర్యాప్తు- కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం
SSC JE Exams: ఎస్ఎస్సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Telangana Elections 2023: స్వల్ప ఉద్రిక్తతలతో ముగిసిన తెలంగాణ ఎన్నికలు, 70 దాటిన పోలింగ్ శాతం
Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
/body>