అన్వేషించండి

Madhya Pradesh Polling: మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్, పలు చోట్ల బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్‌ ఫైట్

Madhya Pradesh Election: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌ కొనసాగుతోంది.

Madhya Pradesh Election 2023:


కొనసాగుతున్న పోలింగ్..

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ (నవంబర్ 17) పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ పూర్తి కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఓ విడత ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్ 7వ తేదీన మొదటి విడత పూర్తికాగా ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 70 స్థానాల్లో 958 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అటు మధ్యప్రదేశ్‌లో 230 నియోజకవర్గాల్లో 2 వేల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ బరిలో ఉండడం ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్‌గఢ్ పటాన్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్...మేనల్లుడు, బీజేపీ నేత విజయ్ భగేల్‌తో తలపడనున్నారు. ఇప్పటికే కమల్‌నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీ అవినీతి పాలనతో విసిగిపోయారని మండిపడ్డారు. ఈ సారి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకముందని వెల్లడించారు. ఉదయం 9 గంటల నాటికి ఛత్తీస్‌గఢ్‌లో 5.71% పోలింగ్‌ జరగ్గా...మధ్యప్రదేశ్‌లో 11.13% పోలింగ్ నమోదైంది. వాళ్ల భవిష్యత్‌ భద్రంగా ఉండాలంటే కాంగ్రెస్‌ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం బీజేపీ పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఓటు వేసిన తరవాత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికలపై అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని, పిల్లలు, యువతతో పాటు వృద్ధుల నుంచీ తమ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని స్పష్టం చేశారు. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఓటు వేసే ముందు ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. మహిళా ఓటర్లందరికీ చౌహాన్ సతీమణి స్వీట్లు పంచారు. అయితే...మధ్యప్రదేశ్‌లో మొరెనా జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. ఓటింగ్‌లో రిగ్గింగ్‌కి పాల్పడాలని చూసిన కొందరు ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల రాకతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget