అన్వేషించండి

Vegetable Price Hike: కూరగాయల ధరల హెచ్చుతగ్గులపై కేంద్రం ఫోకస్, ఇరేడియేషన్ పద్ధతి తేవాలని ప్లాన్!

Vegetable Price Hike: కూరగాయల ధరల్లో హెచ్చుతగ్గులు నివారించేందుకు కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇరేడియేషన్ పద్ధతి పాటించాలని యోచిస్తోంది.

Vegetable Price Hike: కిలో టమాటా ప్రస్తుతం 150 నుంచి 200 రూపాయలకు వరకు ఉంది. ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్న ధరలు మరికొన్ని రోజుల్లో పాతాళానికి పడిపోవచ్చు. ఉల్లిపాయల ధరలు కూడా అంతే.. అయితే ఆకాశంలో ఉంటాయి.. లేదంటే పాతాళానికి పడిపోతాయి. ఈ ధరల హెచ్చుతగ్గులు ఇటు సామాన్యులను, అటు రైతులను ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశంలో ఆహార నిల్వలను పెంచి ధరల హెచ్చుతగ్గులు లేకుండా చూసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బఫర్ స్టాక్ ఉంచుకుని రేట్లు భారీగా పెరిగిన సందర్భంలో.. ఆ నిల్వలతో ధరలను స్థిరీకరించాలని, చౌకగా దొరికిన సందర్భంలో వాటిని నిల్వ చేసుకోవాలన్న ఆలోచన చేస్తోంది. అయితే బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడంలో ప్రధాన ఇబ్బంది వాటిని చెడిపోకుండా కాపాడటం. కూరగాయలను చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉంచగలిగితేనే కేంద్రం అనుకుంటున్న పరిష్కారం ఫలితాన్నిస్తుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇరేడియేషన్ సాంకేతికతను వాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇరేడియేషన్ టెక్నాలజీ ఎలా పని చేస్తుందంటే?

ఈ పద్ధతిలో కూరగాయలను ఆయనీకరణానికి గురి చేస్తారు. గామా, ఎక్స్ కిరణాలను వాడి కూరగాయలను రేడియేషన్ కు గురి చేస్తారు. ఇలా చేయడం వల్ల కూరగాయల్లోని సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా నశించిపోతాయి. దీంతో కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉల్లిపాయలకు ఇరేడియేషన్ చేస్తే అవి చెడిపోకుండా ఉండటంతో పాటు అవి మొలకెత్తవు, కుళ్లిపోవు, వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఈ పద్ధతిలో కూరగాయల రంగు, రుచిలో ఎలాంటి మార్పు రాదు. అదే స్థాయి నాణ్యత, రుచి, ఆకృతి ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఉల్లిపాయల బఫర్ స్టాక్ పై ఈ ప్రయోగాలు చేపట్టింది కేంద్రం. బాబా అటామికి రీసెర్చ్ సెంటర్ - BARC లో ఉల్లిని ఇరేడియేషన్ చేసే పని జరుగుతోంది. 3 లక్షల టన్నులకు పైగా బఫర్ స్టాక్ ను కొనుగలు చేసి వాటిని సురక్షితంగా ఉంచేందుకు కసరత్తు చేస్తోంది.

లూయిస్ స్టాడ్లర్ కనుగొన్న ఇరేడియేషన్

ఆహార వికిరణాన్ని అమెరికాలోని మిస్సౌరీ విశ్వవిద్యాలయానికి చెందిన లూయిస్ స్టాడ్లర్ ఈ పద్ధతిని కనుగొన్నారు. ఈ ప్రయోగాన్ని మొదటి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి, కొన్ని రకాల తృణధాన్యాలపై చేపట్టారు. ఈ ఇరేడియేషన్ పద్ధతి ద్వారా ఉల్లిని నిల్వ చేయడం వల్ల ఎదురయ్యే 25 శాతం నష్టాన్ని.. 10 శాతానికి తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఈ పద్ధతి సురక్షితమేనా?

ఇరేడియేషన్ పద్ధతి ద్వారా నిల్వ చేసిన ఆహారాన్ని తింటే ఎంత వరకు సురక్షితం అనే అంశంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పలు పరిశోధనలు నిర్వహించాయి. ఇరేడియేషన్ ప్రక్రియ పూర్తి సురిక్షితమైనదని ఆయా అధ్యయనాల్లో తేలింది. ఈ ప్రక్రి ద్వారా కూరగాయల జీవిత కాలాన్ని పెంచడమే కాకుండా.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఇరేడియేషన్ పద్ధతి ద్వారా కురగాయలపై చేరే బ్యాక్టీరియా, క్రిమికీటకాలు, సూక్ష్మక్రిములు నశించిపోతాయి. దీని వల్ల ఆయా కూరగాయలు చెడిపోవు, వాటిని తింటే రోగాలు రావు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget