అన్వేషించండి

Lok Sabha : SIRతో నా తల్లిదండ్రుల పేర్లనే తీసేశారు, చాలా సంతోషంగా ఉంది: లోక్ సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కామెంట్స్

Nishikant Dubey News: లోక్‌సభలో SIRపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల పేరును SIR నుంచి తొలగించినందుకు సంతోషంగా ఉందన్నారు.

Lok Sabha : లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ కీలక వ్యాక్యలు చేశారు. SIR ప్రక్రియలో తన తల్లిదండ్రుల పేర్లు కూడా తీసేశారని సభకు తెలియజేశారు. తన తల్లిదండ్రులు ఢిల్లీలో నివసిస్తున్నందున, బిహార్‌లో ఓటు వేసే హక్కు వారికి లేదని ఆయన అన్నారు. అందుకే అలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, పారదర్శకత తెలిసిందని చెప్పుకొచ్చారు. 

SIR గురించి ప్రస్తావిస్తూ, బీజేపీ ఎంపీ మాట్లాడుతూ, "నా తల్లిదండ్రులు మా స్వగ్రామంలో ఉండటం లేదు. నా తల్లిదండ్రులు నాతో ఢిల్లీలో నివసిస్తున్నారు. వారి పేరు బిహార్‌లో ఉన్న ఓటర్ జాబితాలో ఉన్నాయి. వాటిని SIR ద్వారా తొలగించారు. దీనికి నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే వారు ఢిల్లీలో నివసిస్తున్నారు, కాబట్టి ఏ విధంగానూ బిహార్‌లో ఓటు వేసే అధికారం వారికి లేదు." అని అన్నారు.

EVMని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారు - నిషికాంత్ దూబే

EVM గురించి ప్రస్తావిస్తూ ఎంపీ మాట్లాడుతూ, "ఈ EVMని ఎవరు తీసుకువచ్చారు? ఈ EVMని కాంగ్రెస్ తీసుకువచ్చింది. 1987లో తొలిసారిగా రాజీవ్ గాంధీ ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా EVMని తీసుకువచ్చారు. 1991లో నరసింహారావు ప్రభుత్వం వచ్చినప్పుడు, EVM తీసుకురావాలని నిర్ణయించారు. 1961, 1971 ఎంపిక కమిటీల అధ్యక్షులు జగన్నాథ్ రావు కాంగ్రెస్ సభ్యులు. 1971 నివేదికలో, కాంగ్రెస్ న్యాయ మంత్రి HR గోఖలే, రెండు నివేదికల్లోనూ SIR అవసరమని పేర్కొన్నారు." అని అన్నారు.

చరిత్రను వక్రీకరించడం కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలి - దూబే

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, "ఎవరైనా చరిత్రను వక్రీకరించాలనుకుంటే, వారు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ 1988లో ఈ దేశంలో ఎన్నికల సంస్కరణల్లో అతిపెద్ద సవరణ చేశారని అన్నారు. ఏం సవరణ చేశారు? 21 సంవత్సరాల వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. 1972 జాయింట్ కమిటీ నివేదిక 21కి బదులుగా 18 సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసింది. మీరు దానిని 16 సంవత్సరాల తర్వాత అమలు చేయగలిగారు." అని అన్నారు.

నిషికాంత్ దూబే ఈ గణాంకాలను వివరించారు

నిషికాంత్ దూబే పార్లమెంటులో కొన్ని గణాంకాలను కూడా వివరించారు. బిహార్‌లోని వాల్మీకి నగర్ స్థానం గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ ఓట్ల తొలగింపు 2311, అక్కడ కాంగ్రెస్ 1675 ఓట్ల తేడాతో గెలిచిందని అన్నారు. చన్‌పటియా స్థానంలో SIR ద్వారా 1033 ఓట్లను అధికారులు తొలగించారు, కాంగ్రెస్ 602 ఓట్ల తేడాతో గెలిచింది. ఢాకా స్థానంలో 457 ఓట్లను జాబితా నుంచి డిలీట్ చేశారు. అక్కడ RJD 178 ఓట్ల తేడాతో గెలిచింది. ఫార్బిస్‌గంజ్ స్థానంలో 1400 ఓట్లు తొలగించారు. కాంగ్రెస్ 221 ఓట్ల తేడాతో గెలిచింది. బలరాంపూర్ స్థానంలో 1468 ఓట్లు తొలగించారు. LJP (R) 389 ఓట్ల తేడాతో గెలిచింది. రామ్‌గఢ్ స్థానంలో 1197 ఓట్లు తొలగించారు. బహుజన్ సమాజ్ పార్టీ 30 ఓట్ల తేడాతో గెలిచింది. జహానాబాద్‌లో 1832 ఓట్లు డిలీట్ చేశారు. RJD 793 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ గణాంకాలను వివరించిన తరువాత, "మేము చాలా ప్రాంతాల్లో ఓడిపోయినా కానీ మేము ఓటు రాజకీయాలు చేయము, మేము దేశ రాజకీయాలు చేస్తాము." అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
Advertisement

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Hydra Latest News: కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
Sumanth: సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Embed widget