అన్వేషించండి

Lok Sabha : SIRతో నా తల్లిదండ్రుల పేర్లనే తీసేశారు, చాలా సంతోషంగా ఉంది: లోక్ సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కామెంట్స్

Nishikant Dubey News: లోక్‌సభలో SIRపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల పేరును SIR నుంచి తొలగించినందుకు సంతోషంగా ఉందన్నారు.

Lok Sabha : లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ కీలక వ్యాక్యలు చేశారు. SIR ప్రక్రియలో తన తల్లిదండ్రుల పేర్లు కూడా తీసేశారని సభకు తెలియజేశారు. తన తల్లిదండ్రులు ఢిల్లీలో నివసిస్తున్నందున, బిహార్‌లో ఓటు వేసే హక్కు వారికి లేదని ఆయన అన్నారు. అందుకే అలా చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, పారదర్శకత తెలిసిందని చెప్పుకొచ్చారు. 

SIR గురించి ప్రస్తావిస్తూ, బీజేపీ ఎంపీ మాట్లాడుతూ, "నా తల్లిదండ్రులు మా స్వగ్రామంలో ఉండటం లేదు. నా తల్లిదండ్రులు నాతో ఢిల్లీలో నివసిస్తున్నారు. వారి పేరు బిహార్‌లో ఉన్న ఓటర్ జాబితాలో ఉన్నాయి. వాటిని SIR ద్వారా తొలగించారు. దీనికి నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే వారు ఢిల్లీలో నివసిస్తున్నారు, కాబట్టి ఏ విధంగానూ బిహార్‌లో ఓటు వేసే అధికారం వారికి లేదు." అని అన్నారు.

EVMని రాజీవ్ గాంధీ తీసుకువచ్చారు - నిషికాంత్ దూబే

EVM గురించి ప్రస్తావిస్తూ ఎంపీ మాట్లాడుతూ, "ఈ EVMని ఎవరు తీసుకువచ్చారు? ఈ EVMని కాంగ్రెస్ తీసుకువచ్చింది. 1987లో తొలిసారిగా రాజీవ్ గాంధీ ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా EVMని తీసుకువచ్చారు. 1991లో నరసింహారావు ప్రభుత్వం వచ్చినప్పుడు, EVM తీసుకురావాలని నిర్ణయించారు. 1961, 1971 ఎంపిక కమిటీల అధ్యక్షులు జగన్నాథ్ రావు కాంగ్రెస్ సభ్యులు. 1971 నివేదికలో, కాంగ్రెస్ న్యాయ మంత్రి HR గోఖలే, రెండు నివేదికల్లోనూ SIR అవసరమని పేర్కొన్నారు." అని అన్నారు.

చరిత్రను వక్రీకరించడం కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలి - దూబే

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, "ఎవరైనా చరిత్రను వక్రీకరించాలనుకుంటే, వారు కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ 1988లో ఈ దేశంలో ఎన్నికల సంస్కరణల్లో అతిపెద్ద సవరణ చేశారని అన్నారు. ఏం సవరణ చేశారు? 21 సంవత్సరాల వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. 1972 జాయింట్ కమిటీ నివేదిక 21కి బదులుగా 18 సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసింది. మీరు దానిని 16 సంవత్సరాల తర్వాత అమలు చేయగలిగారు." అని అన్నారు.

నిషికాంత్ దూబే ఈ గణాంకాలను వివరించారు

నిషికాంత్ దూబే పార్లమెంటులో కొన్ని గణాంకాలను కూడా వివరించారు. బిహార్‌లోని వాల్మీకి నగర్ స్థానం గురించి ప్రస్తావిస్తూ, ఇక్కడ ఓట్ల తొలగింపు 2311, అక్కడ కాంగ్రెస్ 1675 ఓట్ల తేడాతో గెలిచిందని అన్నారు. చన్‌పటియా స్థానంలో SIR ద్వారా 1033 ఓట్లను అధికారులు తొలగించారు, కాంగ్రెస్ 602 ఓట్ల తేడాతో గెలిచింది. ఢాకా స్థానంలో 457 ఓట్లను జాబితా నుంచి డిలీట్ చేశారు. అక్కడ RJD 178 ఓట్ల తేడాతో గెలిచింది. ఫార్బిస్‌గంజ్ స్థానంలో 1400 ఓట్లు తొలగించారు. కాంగ్రెస్ 221 ఓట్ల తేడాతో గెలిచింది. బలరాంపూర్ స్థానంలో 1468 ఓట్లు తొలగించారు. LJP (R) 389 ఓట్ల తేడాతో గెలిచింది. రామ్‌గఢ్ స్థానంలో 1197 ఓట్లు తొలగించారు. బహుజన్ సమాజ్ పార్టీ 30 ఓట్ల తేడాతో గెలిచింది. జహానాబాద్‌లో 1832 ఓట్లు డిలీట్ చేశారు. RJD 793 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ గణాంకాలను వివరించిన తరువాత, "మేము చాలా ప్రాంతాల్లో ఓడిపోయినా కానీ మేము ఓటు రాజకీయాలు చేయము, మేము దేశ రాజకీయాలు చేస్తాము." అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget