అన్వేషించండి

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌పై బీజేపీ క్లారిటీతో ఉందా? ఏపీ ఎంపీకి ఆ ఛాన్స్ రానుందా ?

Lok Sabha Speaker Race: లోక్ సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందేమోననే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పేర్లు వినిపిస్తున్నాయి.

Daggubati Purandeswari: నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడో సారి కొలువుదీరింది. ఇప్పటికే కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేసేసింది. ఎంపీల ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందేమోననే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడమే ఇందుకు కారణం. బీజేపీ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూలకు ఈ పదవి దక్కుతుందని తొలుత ప్రచారం జరిగింది. కీలకమైన స్పీకర్ పదవి కోసం టీడీపీ, జేడీయూ కొంతకాలం పట్టుబడినట్లు సమాచారం.

రాజ్‌నాథ్‌కు ఆ బాధ్యత
కానీ బీజేపీ ఆ అవకాశం మిత్రపక్షాలకు ఇవ్వలేదు. తన పార్టీకి చెందిన వ్యక్తినే స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించే బాధ్యతను సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్‌ సింగ్‌కు బీజేపీ అప్పగించింది. ఇటీవల బీజేపీ పెద్దలు సైతం దీనిపై స్పందిస్తూ మిత్ర పక్షాల నుంచి స్పీకర్ పదవిపై ఎటువంటి షరతులు పెట్టలేదని ప్రకటించారు. ఈ క్రమంలోనే స్పీకర్ పదవి కోసం పోటీ పడడం లేదని టీడీపీ లీకులు ఇస్తూ వచ్చింది. జేడీయూ సైతం దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో బీజేపీకి స్పీకర్ పదవి దాదాపు ఖాయం అయినట్లు అయినట్లు తెలుస్తోంది. 

సంకీర్ణ ప్రభుత్వాల్లో స్పీకర్ పాత్ర కీలకం
సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు స్పీకర్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఎంపీలపై అనర్హత వేటు, ఫిర్యాదులు, ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది. తాజాగా బీజేపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో క్లిష్ట సమయాల్లో స్పీకర్ తమ వ్యక్తి అయితేనే బాగుంటుందని బీజేపీ భావిస్తోంది. అందుకే మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తమ పార్టీ నేతనే స్పీకర్ సీట్లో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే రాజ్ నాథ్‌ సింగ్‌ను రంగంలోకి దించింది. ఆయన 2004 నుంచి ప్రతిపక్షాలు, ఇతర పార్టీలతో సమావేశమై ఏకాభిప్రాయంతో స్పీకర్ స్థానాన్ని భర్తీ చేయడంలో కీలకంగా వ్యవవహరిస్తున్నారు.  

స్పీకర్ రేసులో ఉన్నది వీరే
స్పీకర్ రేసులో ప్రముఖంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పేర్లు వినిపిస్తున్నాయి. పురందేశ్వరి మహిళ కావడం, దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు కలిసొచ్చే అంశాలు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే ఆమె రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా విజయం సాధించారు. ఆమెకు స్పీకర్ స్థానం ఇస్తే టీడీపీ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది. దీంతో స్పీకర్ పదవి కోసం టీడీపీ పట్టుబట్టకపోవచ్చని బీజేపీ భావిస్తోంది. అలాగే భర్తృహరి మహతాబ్ సైతం ఏడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. కటక్ నుంచి ఎంపీగా గెలిచారు. 

డిప్యూటీ స్పీకర్ కోసం ఇండియా కూటమి పట్టు
రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌గా జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఉండడంతో స్పీకర్ రేసు నుంచి జేడీయూ కూడా దాదాపు తప్పుకున్నట్టే. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేయడంపైనే ఆసక్తి చూపుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తమకు సహకారం కావాలని, అందుకు తాము బీజేకి మద్దతు ఇస్తామని చెబుతోంది. అయితే ఇండియా కూటమి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతోంది. అలా ఇవ్వకపోతే స్పీకర్‌కు అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరిస్తోంది. బీజేపీ మాత్రం ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget