అన్వేషించండి

Opposition Meeting: అంతా సున్నానే! ప్రతిపక్షాల లక్ష్యం ఎన్నటికీ నెరవేరదు: విపక్షాల భేటీపై మాజీ సీఎం సెటైర్లు

Opposition Meeting: బెంగళూరులో జూలై 17, 18 తేదీల్లో జరగనున్న విపక్షాల సమావేశంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు బసవరాజ్ బొమ్మై ఘాటు విమర్శలు చేశారు.

Opposition Meeting: బెంగళూరులో జూలై 17, 18 తేదీల్లో జరగనున్న విపక్షాల సమావేశంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు బసవరాజ్ బొమ్మై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే ప్రతిపక్షాల లక్ష్యమని ఆయన అన్నారు. కానీ అది ఎప్పటికి జరిగే పని కాదన్నారు.

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చీలికలు, అజిత్ పవార్ వర్గం బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడం, పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్న సమయంలో ఈ సమావేశం జరుగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు మెగా సమావేశం జరగనుంది. ఇందులో ప్రముఖ పార్టీలు కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ, ఎన్‌సీపీ 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానున్నాయి. 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు.  ఇందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు వేదిక కానుంది. ఈ సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆప్ నేత రాఘవ్‌ చద్దా తెలిపారు. గత ఆదివారం జరిగిన ఆప్‌ పీఏసీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 

ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్‌ 23న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.

 రేపు ఎన్డీఏ పక్ష సమావేశం

విపక్షాల సమావేశం నేపథ్యంలో బీజేపీ కూడా స్పీడ్ పెంచింది. ఎన్‌డీఏ పక్ష మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఎన్‌డీఏ మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం జనసేన పార్టీకి మాత్రమే బీజేపీ నుంచి ఆహ్వానం అందింది. అధికార పార్టీలు ఎన్డీఏ సమావేశానికి దూరంగా ఉంటున్నాయి. బీజేపీతో పొత్తు కోసం యత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందలేదు. 

అక్కడ చంపుకుంటూ.. ఇక్కడ కలుస్తున్నారు? : బీజేపీ రాహుల్ సిన్హా
విపక్షాల సమావేశంపై బీజేపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు రాహుల్ సిన్హా సైతం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సోమవారం ఆయన ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సీపీఐ (ఎం), టీఎంసీలు బెంగాల్‌లో ఒకరినొకరు చంపుకుంటున్నాయని, కానీ ప్రధాని మోడీని గద్దె దింపడానికి బెంగళూరులో ఏకమవుతున్నారని విమర్శించారు.  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలల్లో జరిగిన హింసను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. అధికార టీఎంసీ, ప్రతిపక్ష సీపీఎంలు ఒకరినొకరు చంపుకుంటూ ప్రధాని మోదీని అధికారం నుంచి గద్దె దింపడానికి బెంగళూరులో ఏకమవుతున్నారని, ఈ డ్రామాలు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లలు - ఈ టైంలో వారికి నో ఎంట్రీ, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Amazon Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
అమెజాన్ గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ మరో ట్వీట్ - సింపుల్‌గా సమస్య పరిష్కరించాల్సిందేనని డిమాండ్
Supreme Court On Jagan Cases: హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీగా విచారణ - జగన్ అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌- యాజమాన్యానికి ఉద్యోగుల నోటీసు 
PM Modi And Trump Talk Over Phone:డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ- ఏయే అంశాలు చర్చించారంటే! 
Crime News: మీర్‌పేట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్- నిందితుడు కుక్కర్‌ వాడకుండా డెడ్‌బాడీ ఇలా మాయం చేశాడు!
మీర్‌పేట్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్- నిందితుడు కుక్కర్‌ వాడకుండా డెడ్‌బాడీ ఇలా మాయం చేశాడు!
IPL Held Date Change: ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
ఐపీఎల్ నిర్వహణ తేదీ మార్పు.. కొత్త డేట్ పై అప్డేట్ ఇచ్చిన లీగ్ చైర్మన్
Man Eater: ఆ  పులి కడుపులో మహిళ వెంట్రుకలు, చెవి రింగులు - మరో క్రూర మృగం దాడిలోనే మ్యాన్ ఈటర్ మృతి?
ఆ పులి కడుపులో మహిళ వెంట్రుకలు, చెవి రింగులు - మరో క్రూర మృగం దాడిలోనే మ్యాన్ ఈటర్ మృతి?
Embed widget