అన్వేషించండి

Arvind Kejriwal Rajya Sabha: ఉప ఎన్నికల బరిలో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా, ఆయన స్థానంలో రాజ్యసభకు కేజ్రీవాల్ వెళ్తున్నారా ?

Delhi News | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారని జరుగుతున్న ప్రచారంపై ఆప్ పార్టీ నేతలు స్పందించారు. అలాంటిదేమీ లేదని, ఆ ప్రచారంలో నిజం లేదని ఆప్ వర్గాలు వెల్లడించాయి.

Arvind Kejriwal not going to Rajya Sabha:  న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా లూధియానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆప్ ప్రకటించిన వెంటనే..  రాజ్యసభకు కేజ్రీవాల్ అని సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా సైతం రిపోర్ట్ చేసింది. అయితే అవన్నీ వదంతులేనని.. సంజీవ్ అరోరా స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్దల సభకు కేజ్రీవాల్ అనే ప్రచారం వదంతులు మాత్రమేనని, ఇలాంటి విషయాలను నమ్మవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి ప్రవేశించారనే మీడియా నివేదికలను ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. లూధియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయాలని సంజయ్ అరోరా భావిస్తున్నారు. ఆయన నిర్ణయానికి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓకే చెప్పారు. లూధియానా వెస్ట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది. 

ఢిల్లీలో ఓటమి అనంతరం పంజాబ్ నేతలతో భేటీ

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫిబ్రవరి 11న పంజాబ్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, కీలక నేతలతో కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశం అయ్యారు. పంజాబ్ ఆప్ నేతలతో భేటీ అనంతరం లూధియానా అసెంబ్లీ స్థానం నుండి కేజ్రీవాల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు ఆప్ లో అంతర్గత విభేదాలున్నాయని, అందుకే కేజ్రీవాల్ పంజాబ్ లో యాక్టివ్ గా ఉండాలని భావిస్తున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. లూధియాని వెస్ట్ నుంచి పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది. దాంతో ఆయన స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని కొత్త ప్రచారం ఊపందుకుంది. వీటిలో నిజం లేదని, ఢిల్లీ ఆప్ వర్గాలు ఆ వదంతులను కొట్టిపారేశాయి.

ఎమ్మెల్యేగా సైతం ఓడిన కేజ్రీవాల్

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. ఎమ్మెల్యేగా సైతం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత  పర్వేశ్ వర్మ చేతిలో కేజ్రీవాల్‌ ఓడిపోయారు. 62 సీట్లతో ఉన్న కేజ్రీవాల్ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితం కావడంతో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేశారు.

అవినీతిపై పోరాడిన యోధుడిగా కనిపించిన మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కేజ్రీవాల్ చివరకు అవినీతి మరకలు అంటుకుని అధికారానికి దూరమయ్యారు. తాను రాజకీయాలకు వెళ్లొద్దని కేజ్రీవాల్ కు ముందుగానే సూచించానని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. రాజకీయాల్లో ఉంటే ఎన్నికలకు వెళ్లేటప్పుడు క్లీన్ చిట్ గా ఉండాలని, అవినీతి ఆరోపణలు ఉండొద్దని అన్నా హజారే అభిప్రాయపడ్డారు.

Also Read: Karnataka: భోజనం చేశాక కాసేపు కునుకు తీయడానికి రిక్లైనర్లు - కర్ణాటక ఎమ్మెల్యేలకు స్పీకర్ బంపర్ ఆఫర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rahul Gandhi Protest:ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్ ఎదుట రాహుల్ ధర్నా! పెల్లెట్ గన్‌ కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget