అన్వేషించండి

Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!

Maharashtra New CM Name: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై క్లారిటీ వచ్చింది. రాత్రి ముగ్గురు నేతలతో అమిత్‌షా సమావేశమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Maharashtra CM News: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సంబంధించి నిన్న రాత్రి (నవంబర్ 28) ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరిగింది. మహారాష్ట్ర రాజకీయాలపై అమిత్ షా, ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఇతర నేతలు చర్చించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి పదవి, మంత్రి వర్గ కేటాయింపులపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారు అయినప్పటికీ అధికారికంగా రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. 

నేడు ముంబైలో మహాకూటమి సమావేశం జరగనుంది. షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ఈ సమావేశానికి హాజరవుతారు. అమిత్ షా ఇచ్చిన సలహాలు, నిర్ణయాలపై చర్చిస్తారు. మరో రెండు రోజుల్లో మహారాష్ట్రకు పరిశీలకులు వస్తారని తెలుస్తోంది. కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది. 

సమావేశంలో ఏం జరిగింది?
నిన్న ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై చర్చించారు. అమిత్ షా నివాసంలో రాత్రి సుమారు రెండు గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. సీఎంగా ఫడ్నవీస్‌ దాదాపు ఖరారు అయినప్పటికీ ఢిల్లీ నుంచి పరిశీలకులు రెండు రోజుల్లో మహారాష్ట్ర వస్తారని అప్పుడే ప్రకటిస్తారని తెలియజేసినట్టు సమాచారం. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

సమావేశంలో ఏక్‌నాథ్ షిండే ఏం చెప్పారు?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన డిమాండ్లను ఉంచారు. స్పీకర్ పదవితో పాటు 12 మంత్రి పదవులు ఇవ్వాలని సూచించారు. హోం, పట్టణాభివృద్ధి సహా ముఖ్యమైన శాఖలను అడిగారు. హోంమంత్రి ఇచ్చినప్పటికీ తగిన గౌరవాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. 

ముంబైలో మరోసారి భేటీ
మహాకూటమి సమావేశం నేడు ముంబైలో జరగనుంది. అమిత్ షా చెప్పిన సలహాలు, నిర్ణయాలపై దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే చర్చించనున్నట్లు సమాచారం. షాతో భేటీ సానుకూలంగానే ఉందని 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని ముగ్గురం కలిసి పని చేస్తామన్నారు. 

21, 12, 10 ఫార్ములాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. బీజేపీకి గరిష్టంగా 20 నుంచి 25 మంత్రిపదవులు శివసేనకు 10 నుంచి 12, ఎన్సీపీకి 7-9 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇది ప్రాథమిక చర్చలు మాత్రమే అని ఇంకా పూర్తి స్థాయి చర్చలు ఇవాళ జరగనున్నట్టు సమాచారం. 

ఈసారి మంత్రి వర్గంలో సీనియర్ నేతలకు పెద్దగా ఛాన్స్ లేకపోవచ్చని తెలుస్తోంది. యువ నాయకులను తీసుకోనున్నారట. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కబోదని అంటున్నారు. 

అమిత్‌షాతో సమావేశం అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ సంతోషంగా ఉంటే ఏక్‌నాథ్ షిండే మాత్రం డీలాపడిపోయినట్టు చెబుతున్నారు. ఈ సమావేశానికి చెందిన ఫొటోలు చూస్తే అమిత్ షా దేవేంద్ర ఫడ్నవీస్‌కి పుష్పగుచ్ఛం ఇస్తున్నట్లు ఉంది. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. అందుకు భిన్నంగా పక్కనే నిల్చున్న ఏకనాథ్ షిండే ముఖంలో ఎక్స్ ప్రెషన్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ఢిల్లీ మీటింగ్‌ తర్వాత ఏకనాథ్ షిండే బాడీ లాంగ్వేజ్  చర్చనీయాంశంగా మారింది.

Also Read: జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన "మోగ్లీ" నిజ జీవితంలో ఉన్నాడని తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
New Toll Policy: మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
మరో 15 రోజులే, ఆ తర్వాత ఒక్క టోల్ గేట్‌ కూడా కనిపించదు!
Tirumala: 2025 మే 11 నుంచి 19 వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
2025 మే 11 నుంచి 19 వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
TGEAPCET: తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
తెలంగాణ ఎప్‌సెట్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్, ఎప్పటినుంచంటే? పరీక్షల తేదీలు ఇవే
Anurag Kashyap: బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
బ్రాహ్మణులపై మూత్రం పోస్తా -కలకలం రేపుతున్న బాలీవుడ్ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Embed widget