అన్వేషించండి

AI టెక్నాలజీ మన జీవితాల్ని సింప్లిఫై చేస్తుండొచ్చు, కానీ తస్మాత్ జాగ్రత్త - సీజేఐ చంద్రచూడ్

CJI DY Chandrachud: AI, చాట్‌జీపీటీ టెక్నాలజీపై సీజేఐ చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

CJI DY Chandrachud: 


చాట్‌జీపీటీపై వ్యాఖ్యలు..

AI,ChatGPT టెక్నాలజీపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు కష్టమైన పనులనూ సింపుల్‌గా చేసేస్తున్నాయని అన్నారు. జోక్స్‌ చెప్పడం నుంచి కోడింగ్ వరకూ అన్నీ ఈ టెక్నాలజీతో సులభతరమైపోయాయని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టెక్నాలజీతో లీగల్ సబ్జెక్ట్‌లనూ సులువుగా రాసే వెసులుబాటు వచ్చిందని తెలిపారు. హ్యూమన్ డెవలప్‌మెంట్‌కి ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో కూడా గమనించాలని సూచించారు. 

"ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ కెపాసిటీ ఈ టెక్నాలజీతో ఎంతో పెరిగిపోయింది. ఇదే సమయంలో చాట్‌జీపీటీ వినియోగమూ పెరిగింది. చిన్న చిన్న జోక్స్‌ నుంచి కోడింగ్ లాంటి అతి కష్టమైన విషయాలనూ ఈ టెక్నాలజీ చాలా సింప్లిఫై చేసింది. లీగల్ టాపిక్స్‌ని కూడా సులభంగా రాసే వెసులుబాటునిచ్చింది"

- డీవై చంద్రచూడ్, సీజేఐ

త్వరలోనే సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ని స్ట్రీమింగ్ చేయడంలో AI టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్పారు. ట్రయల్ బేసిస్‌లో దీన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. 

"ట్రయల్ బేసిస్‌లో సుప్రీంకోర్టులోనూ AI టెక్నాలజీ వినియోగిస్తున్నాం. ప్రొసీడింగ్స్‌ని స్ట్రీమింగ్ చేసేందుకు వాడుతున్నాం. ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. మానవ అభివృద్ధిలో ఈ టెక్నాలజీ ఏ మేర ఉపయోగపడుతుందన్నది గమనించాలి. దీన్ని దుర్వినియోగం చేసే వాళ్లూ ఉంటారు.  ప్రజల్లో ఆ భయం కలిగితే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఈ ఆందోళన మొదలైతే ఎవరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోలేరు. మానవ విలువలతో పాటు వ్యక్తిగత గోప్యత చాలా అవసరం. టెక్నాలజీ కారణంగా ఇవి మిస్‌యూజ్ అవ్వకూడదు. ఆన్‌లైన్‌ వేధింపులు, బెదిరింపులు కూడా పెరిగే ప్రమాదముంది. "

- డీవై చంద్రచూడ్, సీజేఐ

స్పెషల్ కోర్స్...

కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు 'నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీవీఈటీ)', ఐఐటీ మద్రాస్ గుర్తింపు కూడా దక్కించుకుంది. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ జీయూవీ.. పర్సనలైజ్డ్ లెర్నింగ్ సొల్యూషన్స్‌ విభాగాల్లో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ వివిధ ప్రాంతీయ భాషల్లో సాంకేతిక నైపుణ్యాలను బోధించడం, ఆన్‌లైన్ లెర్నింగ్, అప్‌స్కిల్లింగ్, రిక్రూట్‌మెంట్ అవకాశాల వంటి సేవలను అందిస్తోంది. 

Also Read: Longest Serving CM: ఒడిశా సీఎం సరికొత్త రికార్డు, అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రెండో లీడర్‌గా నవీన్ పట్నాయక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
Viral News: మూడింటికే కోడి కూస్తోందట -కేసు పెట్టేశాడు - ఆర్డీవో ఏం తీర్పు చెప్పారంటే ?
మూడింటికే కోడి కూస్తోందట -కేసు పెట్టేశాడు - ఆర్డీవో ఏం తీర్పు చెప్పారంటే ?
KCR BRS Meeting: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.