News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

రామ మందిరం తెరుచుకున్నాక గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయేమో, ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని ఉద్దవ్ థాక్రే అన్నారు.

FOLLOW US: 
Share:

Ayodhya Ram Temple: 


గోద్రా తరహా అల్లర్లు..

ఉద్దవ్ బాల్ థాక్రే (UBT) చీఫ్ ఉద్దవ్ థాక్రే అయోధ్య రామ మందిరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి దేశం నలు మూలల నుంచి భక్తులు తరలి వస్తారని, ఆ సమయంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని అన్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్లే సమయంలో దాడులు జరిగొచ్చని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2002లో ఫిబ్రవరి 27న అయోధ్యకి వెళ్లి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తున్న కర సేవకులపై దాడి జరిగింది. వాళ్లున్న కోచ్‌కి నిప్పంటించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి అల్లర్లే ఇప్పుడూ జరుగుతుండొచ్చని ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా వేడి పుట్టించింది. 

"అయోధ్యలోని రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తైంది. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వేలాది మంది బస్‌లు, ట్రక్‌లలో తరలి వస్తారు. వాళ్లు వచ్చి ఇళ్లకు వెళ్లిపోయే క్రమంలో దాడులు జరిగే అవకాశముంది. మరోసారి గోద్రా తరహా అల్లర్లు జరుగుతుండొచ్చు"

- ఉద్దవ్ థాక్రే, యూబీటీ చీఫ్ 

బీజేపీపై ఆగ్రహం..

వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. BJP,RSSపైనా తీవ్ర విమర్శలు చేశారు ఉద్దవ్ థాక్రే. బీజేపీ సాధించింది ఏమీ లేదని, కేవలం సర్దార్ పటేల్‌ విగ్రహాన్ని పెద్ద ఎత్తున పెట్టినంత మాత్రాన సరిపోతుందా అని ప్రశ్నించారు. సర్దార్ పటేల్‌ దరిదాపుల్లోకి కూడా బీజేపీ రాలేదని మండి పడ్డారు. ఈ విమర్శలపై బీజేపీ ఎంపీ రవి శంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారంటూ విమర్శించారు. 

"విపక్ష కూటమి మొత్తం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పని చేస్తోంది. ఓట్ల కోసం ఏదైనా మాట్లాడతారు. ఎంతకైనా దిగజారుతారు. వీళ్లకు కాస్త జ్ఞానం ఇవ్వాలని ఆ రాముడిని ప్రార్థిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు సిగ్గు చేటు. పూర్తిగా ఖండిస్తున్నాం"

- రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఎంపీ


 

Published at : 11 Sep 2023 03:42 PM (IST) Tags: Uddhav Thackeray Ayodhya Ram temple Ayodhya Ram Mandir Godhra Incident UBT

ఇవి కూడా చూడండి

Gayatri Joshi: కార్ల పరేడ్‌లో ప్రమాదం, బాలీవుడ్‌ నటికి తీవ్ర గాయాలు - ఇద్దరి మృతితో విషాదం

Gayatri Joshi: కార్ల పరేడ్‌లో ప్రమాదం, బాలీవుడ్‌ నటికి తీవ్ర గాయాలు - ఇద్దరి మృతితో విషాదం

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం

గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పెంచిన కేంద్రం, కేబినెట్ సమావేశంలో నిర్ణయం

NCPతో మాది రాజకీయ మైత్రి మాత్రమే, దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు

NCPతో మాది రాజకీయ మైత్రి మాత్రమే, దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, దరఖాస్తుకు నేటితో ఆఖరు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే ఈ ఈడీ సోదాలు - కేజ్రీవాల్ విమర్శలు

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్