Ideas of India Summit 2023 Live: భారత్పై ద్వేషంతోనే పాకిస్థాన్ ఏర్పడింది - ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణ గోపాల్
Ideas of India 2023: ఏబీపీ న్యూస్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ రెండో ఎడిషన్ నేడు(ఫిబ్రవరి 24 )ముంబైలో ప్రారంభమైంది. ఇందులో సెలబ్రిటీలందరూ వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.
LIVE

Background
పాకిస్థాన్ తన అలవాటును మార్చుకోవాలి: కృష్ణ గోపాల్
పాకిస్తాన్ తన మనస్సును సరిగ్గా ఉంచుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నాలుగు సార్లు ఆక్రమణకు యత్నించి విఫలమైంది. తన స్వభావాన్ని మెరుగుపరుచుకోవాలి. భారత్ తో శత్రుత్వ భావనను శాశ్వతంగా వదిలేయాలి. భారత్పైకి ఉగ్రవాదులను పంపిస్తోంది కాబట్టి సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం కొంచెం కష్టమే: కృష్ణ గోపాల్, ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి
యోగి ఆదిత్యనాథ్పై ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణగోపాల్ ఏబీపీ వేదికపై ప్రశంసలు కురిపించారు.
కుల గణన డిమాండ్లో రాజకీయాలు: కృష్ణ గోపాల్
కుల గణన డిమాండ్లో రాజకీయం ఉంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. సమాజంలో కుల వర్గాల మధ్య చిచ్చుపెట్టే ఏ కార్యక్రమం మాకు అవసరం లేదు. కుల అస్తిత్వాన్ని ఏ ఆపరేషన్ ద్వారా బలోపేతం చేయకూడదు: ఆరెస్సెస్ నేత కృష్ణ గోపాల్
జనాభా లెక్కల అంశంపై కృష్ణ గోపాల్ మాట్లాడుతూ..
జనాభా గణన అంశంపై ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఇది దేశ పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది జనాభాలో ప్రమాదకరమైన మార్పులను కూడా వెలికి తీస్తుందన్నారు.
పాకిస్థాన్ లో హిందువుల జనాభా తగ్గింది: కృష్ణ గోపాల్
శత్రుత్వం ఆధారంగా పాకిస్థాన్ ఆవిర్భవించింది. 'మేము భారత్ తో ఉండలేం' అనే జిన్నా, ఇక్బాల్ నమ్మకం పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీసింది. ఇక్కడి హిందువులతో కలిసి జీవించలేమని వారు భావించారు. ఇది తప్పుడు విధానం. అయితే, ముస్లిం జనాభా ఇక్కడ నివసిస్తోంది. అభివృద్ధి చెందుతోంది. పాకిస్తాన్లో హిందూ జనాభా తగ్గింది: కృష్ణ గోపాల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

