అన్వేషించండి

ABP Network Ideas Of India 2023: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ రెండో ఎడిషన్ ఫిబ్రవరి 24న ముంబైలో ప్రారంభం

60 మంది ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ వక్తలు ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా వేదికపై ఆలోచనలు పంచుకోనున్నారు. 'నయా ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్' అనే థీమ్‌తో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇండియాలోనే ప్రముఖ మల్టీ లాంగ్వేజ్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌ ఏబీపీ నెట్‌వర్క్ Ideas Of India రెండో ఎడిషన్ సమావేశాలను నిర్వహిస్తోంది. 2022లో ముంబైలోని గ్రాండ్‌ హయత్‌ సదస్సులో చెప్పినట్టుగానే మరోసారి వైవిధ్యమైన కాన్సెప్టుతో మీ ముందుకు వచ్చింది Ideas Of India రెండో ఎడిషన్. 

దేశంలో వివిధ రంగాల్లో తమ శక్తియుక్తులతో అద్భుతాలు సాధించిన ఎంతో మంది అనుభవజ్ఞులను ఈ Ideas Of India వేదికపైకి తీసుకొస్తోంది ఏబీపీ. అత్యంత విజయవంతమైన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్‌లో భాగంగా 2023లో జరగబోయే సెకండ్ ఎడిషన్‌ను నయా ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్ అనే థీమ్ చుట్టూ డిజైన్ చేశారు. 

ABP నెట్‌వర్క్ CEO అవినాష్ పాండే మాట్లాడుతూ, “2022లో ABP నెట్‌వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' మొదటి ఎడిషన్ అద్భుతమైన విజయం సాధించింది. కేవలం వ్యూవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని చెప్పడం లేదు... భిన్న ఆలోచనలు పంచుకునే ఫోరమ్‌కు సరైన అర్థాన్ని ఇచ్చే వేదికగా మారిందీ ప్రోగ్రామ్. అందుకే నాకు ఒకటి బాగా అర్థమైంది. ABP ఐడియాస్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌ కేవలం ఓ సమావేశం మాత్రమే కాదు. ఇది భారత దేశ బహుళత్వాన్ని తెలియజేసే ఆలోచనలు పంచుకునే వేదికగా మారింది. అందుకే దీనికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక యూనిట్‌గా వేల ఆలోచనలు మథించి మంచి చెడు చర్చిస్తే ఓ మంచి ఆలోచన  ఏర్పడుతుంది. 

రేపటి భారతం ఎలా ఉండాలనే ఆలోచనలు పంచుకునేందుకు ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఓ అధికారిక వేదిక కానుంది. ABP నెట్‌వర్క్ నిర్వహించే 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023' సందర్బంగా ఈ ప్రకటన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆత్మపరిశీలన చేసుకుంటూనే ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ నయా భారత్‌ నిర్మాణానికి ఈ 2023 శిఖరాగ్ర సమావేశం దోహదపడనుంది.  

ఈ సంవత్సరం ముంబైలో జరిగే 2-రోజుల ఈవెంట్ ప్రధానంగా ఈ ప్రశ్నకు సమాధానాలను వెతకనుంది. చరిత్రలో భారత్‌ ఎలాంటి స్థితిలో నిలిచింది? ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఐరోపాలో యుద్ధచ్ఛాయలు కనిపిస్తున్నా ఇంధన అవసరాలను సమర్థంగా తీర్చుకుంటోంది. కరోనా తర్వాత ఇండియాను గ్లోబల్ లీడర్‌గా ప్రపంచం చూస్తోంది. ఈ టైంలో భారత యువత వివిధ రంగాల్లో నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందా? అసహనంతో ఉందా అనేదానిపై చర్చ జరగనుంది. 

ఈ కీలకమైన ప్రశ్నను ఆలోచనాపరులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రాయబారులు, రాజకీయ నాయకులు ఇలా వక్తల జాబితా చాలా పెద్దదిగా వైవిధ్యంగా ఉంటుంది. యూకే మాజీ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఏక్నాథ్ షిండే వంటి ముఖ్యమంత్రుల వరకు విస్తరించింది; నవలా రచయిత, పర్యావరణ ఛాంపియన్ అమితవ్ ఘోష్ నుంచి టెక్, బిజినెస్ ఇన్నోవేషన్ ఐకాన్ ఎన్‌ ఆర్‌ నారాయణ మూర్తి వరకు; అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన విద్యావేత్త, రచయిత మహమూద్ మమదానీ నుంచి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, మరో కేంద్ర మంత్రి-ఇన్‌చార్జ్ అశ్విని వైష్ణవ్, కళలు, సినిమా ప్రపంచం నుంచి జీనత్ అమన్, ఆశా పరేఖ్ వంటి వారితోపాటు ఆయుష్మాన్ ఖురానా వంటి సూపర్ స్టార్‌లు ఇందులో పాల్గొంటున్నారు.  ఎందరికో ఆదర్శంగా ఉండే వినేష్ ఫోగట్, అశ్విని నాచప్ప, జ్వాలా గుత్తా, జోష్నా చినప్ప తమ ఆలోచనలు పంచుకోనున్నారు. 'ఖాన్ సార్', 'ఎన్‌వి సార్' వంటి విద్యా మార్గనిర్దేశకులు నాలెజ్డ్‌ పొందడంపై మాట్లాడతారు. అంతర్జాతీయ చలనచిత్ర దర్శకులు మీరా నాయర్, శేఖర్ కపూర్, నటులు మనోజ్ బాజ్‌పేయి కూడా ప్యానెల్‌లో ఉన్నారు. లక్కీ అలీ, దేవదత్ పట్నాయక్ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తారు. సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా తన వంట మహత్యాన్ని పంచుకోనున్నారు. యువ రాజకీయ ప్రముఖులు పూనమ్ మహాజన్, కె కవిత, ప్రియాంక చతుర్వేది, రాఘవ్ చద్దా వారి వ్యక్తిగత జీవితం, రాజకీయ పార్టీల విధానాలను వివరిస్తారు. నయా భారతదేశం కోసం తీసుకోవాల్సిన అంశాలను వివరిస్తారు. 

ABP ఐడియాస్ ఆఫ్ ఇండియా 2023, 60 కంటే ఎక్కువ మంది వక్తలు 40 చర్చల్లో పాల్గొంటారు. ఇది దేశాన్ని సరికొత్త భారతావనిగా మార్చేందుకు బలాలను గురించి మాట్లాడతారు. ABP ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 ఫిబ్రవరి 24, 25 రెండు రోజుల్లో, మొత్తం ABP నెట్‌వర్క్‌లోని అన్ని విభిన్న డిజిటల్ ప్రసార ప్లాట్‌ఫారమ్‌లలో దీన్ని చూసే వీలు ఉంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget