అన్వేషించండి

Jammu Kashmir Elections: జమ్మూ కశ్మీర్ లో ఆప్ పోటీ- ఏడుగురితో తొలి జాబితా ప్రకటన

Aam Aadmi Party : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Jammu Kashmir Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కాగా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అలాగే గులాం నబీ ఆజాద్ పార్టీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తమ అభ్యర్థులను గెలిపించేందుకు ఇరు పార్టీలు పూర్తి స్థాయిలో ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు 13 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గులాం నబీ ఆజాద్‌ పార్టీ విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో పోటీ చేయనున్న గందర్‌బాల్ స్థానం కూడా ఉంది.  

పుల్వామా నుంచి ఫయాజ్ అహ్మద్ సోఫీకి ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ ఇచ్చింది.  రాజ్‌పోరా నుండి ముద్దాసిర్ హసన్‌ను అభ్యర్థిగా నిలిపింది. దీంతో పాటు దేవ్‌సర్‌ నుంచి షేక్‌ ఫిదా హుస్సేన్‌ను పోటీకి దింపుతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు డూరు అసెంబ్లీ నుంచి మొహ్సిన్ షఫ్కత్ మీర్‌కు టికెట్ ఇచ్చారు. కాగా, దోడా నుంచి మెహ్రాజ్ దీన్ మాలిక్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. దోడా వెస్ట్ అభ్యర్థిగా యాసిర్ షఫీ మట్టోను ప్రకటించారు. అంతేకాకుండా, బనిహాల్ నుంచి ముదస్సిర్ అజ్మత్ మీర్‌ను బరిలోకి దింపుతామని ప్రకటించారు.

ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా 
జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇది కాకుండా, ఢిల్లీ ముఖ్యమంత్రి సతీమణి సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కూడా ఆప్ స్టార్ క్యాంపెయినర్‌లలో ఉన్నారు. ఈ నేతలంతా జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.  

మూడు దశల్లో ఎన్నికలు 
జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన కార్యక్రమం ప్రకారం సెప్టెంబర్ 18న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, రెండో దశ ఎన్నికలు సెప్టెంబర్ 25న జరగనున్నాయి. అక్టోబర్ 1న మూడో దశ ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థులందరికీ ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో ఈసారి 360 మోడల్ పోలింగ్ కేంద్రాలను నిర్మించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో జనరల్‌కు 74, ఎస్‌టీకి 9, ఎస్సీలకు 7 రిజర్వు చేయబడ్డాయి.

ఆర్థికల్ 370రద్దు తర్వాత తొలిసారి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2024లో అనేక పార్టీలు పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పీడీపీ, బీజేపీ, గులాం నబీ ఆజాద్ పార్టీ డీపీఏపీ, అప్నీ పార్టీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget