By: ABP Desam | Updated at : 16 Dec 2021 10:31 PM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు ఆధార్ నమోదును త్వరలో అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నవజాత శిశువులకు ఆధార్ నంబర్లను ఇవ్వడానికి జనన ధృవీకరణ పత్రంతో టై-అప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు UIDAI వెల్లడించింది. అయితే నవజాత శిశువుకు ఆధార్ ఇచ్చే సమయంలో తల్లిదండ్రులలో ఒకరి గుర్తింపు కార్డు కూడా అవసరం ఉంటుంది. ఆధార్ అనేది.. 12 అంకెలు గల సంఖ్య. గుర్తింపు, చిరునామా.. ఇలా ప్రతిదాంట్లో ఇప్పుడు ఆధార్ అనేది ముఖ్యమైపోయింది.
"భారత్ లోని పెద్దల్లో 99.7% మందికి ఆధార్ నమోదై ఉంది. ఇప్పటి వరకు 131 కోట్ల మందికి ఆధార్ ఇచ్చాం. ఇప్పుడు నవజాత శిశువులకు ఆధార్ నమోదు చేయించడమే మా ప్రయత్నం. అప్పుడే పుట్టే పిల్లలకు ఆధార్ ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.' అని UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ చెప్పారు.
బిడ్డ పుట్టినప్పుడు తీసిన ఫొటో ఆధారంగా.. తర్వాత ఆధార్ కార్డ్ ఇస్తామని గార్గ్ వెల్లడించారు. ఇందుకోసం జనన ధృవీకరణ పత్రంతోపాటుగా తల్లిదండ్రుల గుర్తింపు కార్డు కూడా కావాల్సి ఉంటుందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ ను వారి తల్లిదండ్రుల ఆధార్కు లింక్ చేస్తారు. పిల్లల వయస్సు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత.. బయోమెట్రిక్ ద్వారా మళ్లీ ఇస్తామని గార్గ్ వెల్లడించారు.
మేం మా భారతీయులందరికీ ఆధార్ నంబర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా మందికి ఆధార్ నంబర్లు లేవని మాకు తెలిసింది. గత సంవత్సరం మారుమూల ప్రాంతాల్లో 10,000 క్యాంపులు నిర్వహించాం. 30 లక్షల మంది ఆధార్ కోసం నమోదు చేసుకున్నారు.
- సౌరభ్ గార్గ్, UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఐదేళ్లలోపు ఇచ్చిన ఆధార్కార్డు నంబర్లో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే ఆధార్ వివరాల అప్గ్రేడ్ కోసం తల్లిదండ్రులు ఆధార్ కేంద్రానికి వెళ్లాలి.
పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డుతో పాటు పిల్లల స్కూల్ ఐడెంటిటీ కార్డు లేదా బోనఫైడ్ సర్టిఫికెట్ను దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
ఈసారి పిల్లల నుంచి వేలిముద్రలు, ఐరిష్ స్కాన్ సేకరిస్తారు. పిల్లలకు 15 ఏళ్లు నిండిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటాను అప్గ్రేడ్ చేయించాల్సి ఉంటుంది.
Also Read: Fact Check: 'అంతర్జాతీయ కోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ దల్వీర్ భండారీ'.. ఈ వైరల్ వార్తలో నిజమెంత?
Breaking News Live Telugu Updates: సత్తెనపల్లి రామకృష్ణపురం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది బాలికలకు అస్వస్థత
BBC Documentary: ఈ పిటిషన్ల వల్లే సుప్రీంకోర్టు సమయం వృథా అవుతుంది - డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర మంత్రి అసహనం
Bihar Politics: చావనైనా చస్తాం కానీ బీజేపీతో పొత్తు మాత్రం పెట్టుకోం - బిహార్ సీఎం నితీష్ కుమార్
Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ
Nithish Kumar: కేసీఆర్ సభకు నితీష్ కుమార్ రావట్లేదట - బీఆర్ఎస్తో స్నేహంపై కూడా క్లారిటీ!
Jagityala మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు కలెక్టర్ ఆమోదం
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన ‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?
టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ