అన్వేషించండి

26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు

26/11 దాడిని సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దాడితో పోల్చడంపై ఆర్‌వీఎస్ మణి మాట్లాడుతూ.. ఇది కాంగ్రెస్, ISI ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. హిందూ ఉగ్రవాదం యూపీలో హయాంలో వచ్చిందన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దిగ్విజయ్ సింగ్ హిందూ ఉగ్రవాద కేసులను కనుగొనమని కోరారు.
  • మాలెగావ్ కేసు ముందే రాసిన స్క్రిప్ట్, పురోహిత్ అరెస్ట్ కుట్ర.
  • 26/11 కాంగ్రెస్-ఐఎస్‌ఐ మ్యాచ్ ఫిక్సింగ్, హిందూ దాడిగా చిత్రీకరణ.
  • ఇష్రత్ జహాన్ కేసు మోడీ, అమిత్ షాల లక్ష్యంగా మార్చబడింది.

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మాజీ అండర్ సెక్రటరీ రామస్వామి వెంకట సుబ్రమణి హిందూ ఉగ్రవాదం,  26/11 ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏఎన్ఐ కి ఇచ్చిన తన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. తాను హోం శాఖలో పనిచేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనను హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను వెతకాలని కోరారని ఆయన చెప్పారు. దేశంలో అలాంటి కేసులేవీ లేవని తనకు చెప్పినట్లు పేర్కొన్నారు.

హిందూ ఉగ్రవాదం ఫైల్స్ కోసం సెర్చ్ చేశాం.. 

స్మితా ప్రకాష్ ఓ పాడ్‌కాస్ట్‌లో ఆర్‌వీఎస్ మణి మాట్లాడుతూ.. ‘2010 వరకు ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్‌లో ఉన్నప్పుడు, ఏ ఫైల్‌లోనూ హిందూ ఉగ్రవాదం అనే పదం లేదు. జూన్ 2006లో హిందూ ఉగ్రవాదం కేసుల సమాచారాన్ని సేకరించాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. ఇప్పటివరకూ అలాంటి కేసులేవీ లేవని ఆయనకు చెప్పాను. మాలెగావ్ కేసు.. మొదటి రోజు నుంచే ఇది ఒక అబద్ధపు కేసు అని చెబుతూ వచ్చాను. ముందే రాసిన స్క్రిప్ట్ లాగా అనిపించింది. దాని ప్రకారమే సాధ్వి ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్, మేజర్ ఉపాధ్యాయ్ లాంటి వారు పని చేశారు. 

 కల్నల్ పురోహిత్ నేడు జైలు బయట ఉండటం అద్భుతం అని చెప్పాలి. ఆయన అరెస్ట్ అనుకోకుండా చేసింది కాదు. దాని వెనుక ఒక కుట్ర దాగి ఉంది. 34 ఏళ్ల వయసులో ఆయన సెలెక్షన్ గ్రేడ్ లెఫ్టినెంట్ కల్నల్ కాగా, ఆయన ఆర్మీ చీఫ్ కాకున్నా.. కనీసం కోర్ కమాండర్ అయితే ఖచ్చితంగా అయ్యేవారు. ఆ స్థాయికి చేరుకోవడం పాకిస్తాన్ ప్రజలకు ఇష్టం లేదని’ అన్నారు.

ముంబై ఉగ్రదాడులపై సంచలన వ్యాఖ్యలు
ముంబైలో జరిగిన 26/11 దాడిని సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దాడితో పోల్చడంపై ఆర్‌వీఎస్ మణి స్పందించారు. ‘ఇది కాంగ్రెస్ పార్టీ, ISI ల మధ్య జరిగిన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల భారత్‌లో రాజకీయ నేతలకు ఏం లాభం చేకూరుతుంది? అంటే.. దీనిని కేవలం ఒక హిందూ దాడిగా చూపించడమే దాని ఉద్దేశం. కసబ్ చేతికి కూడా రక్షాబంధనం కట్టి ఉంచారు. ఒకవేళ తుకారాం ఓంబ్లే అతడిని పట్టుకోకపోయినా లేదా చంపకపోయినా, ఈ రోజు హిందూ ఉగ్రవాద దాడిగానే పరిగణించేవారు’అని సంచలన విషయాలు చెప్పారు.

Also Read: One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!

‘నా సీనియర్ అధికారులు ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసును రాజకీయ నాయకులు హత్య కేసుగా మార్చేశారు. నాకు సరిగ్గా గుర్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రమే లక్ష్యంగా ఉన్నారని’ మరోవైపు ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుపై వ్యాఖ్యానించారు. బియాంత్ సింగ్ హత్య కేసులో తాను భారత ప్రభుత్వానికి ఏకైక సాక్షినని తెలిపారు. జాతీయ భద్రత పరంగా ముఖ్యమైన అంశం ఏంటంటే.. ప్రధాని మోదీ వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. కానీ సురక్షిత భారత్ అని కూడా ప్రకటించాలని’ తాను భావిస్తున్నట్లు ఆర్‌వీఎస్ మణి పేర్కొన్నారు.

Frequently Asked Questions

దిగ్విజయ్ సింగ్, మాజీ అండర్ సెక్రటరీ రామస్వామి వెంకట సుబ్రమణిని దేని గురించి కోరారు?

దిగ్విజయ్ సింగ్, హిందూ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను వెతకాలని రామస్వామి వెంకట సుబ్రమణిని కోరారు. అయితే, అలాంటి కేసులేవీ లేవని సుబ్రమణి తెలిపారు. 2010 వరకు హోం శాఖ ఫైళ్లలో ఈ పదం లేదు.

మాలెగావ్ కేసు గురించి ఆర్‌వీఎస్ మణి ఏమని వ్యాఖ్యానించారు?

మాలెగావ్ కేసు మొదటి రోజు నుంచే ఒక అబద్ధపు కేసు అని ఆర్‌వీఎస్ మణి పేర్కొన్నారు. అది ముందే రాసిన స్క్రిప్ట్ లాగా అనిపించిందని, కల్నల్ పురోహిత్ అరెస్ట్ వెనుక కుట్ర ఉందని ఆయన అన్నారు.

26/11 ముంబై ఉగ్రదాడుల గురించి ఆర్‌వీఎస్ మణి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటి?

26/11 ముంబై ఉగ్రదాడి కాంగ్రెస్ పార్టీ, ఐఎస్‌ఐల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అని మణి అన్నారు. దీనిని ఒక హిందూ దాడిగా చూపించడమే వారి ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసుపై ఆర్‌వీఎస్ మణి అభిప్రాయం ఏమిటి?

ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసును రాజకీయ నాయకులు హత్య కేసుగా మార్చారని మణి తెలిపారు. అప్పటి ప్రధాని మోదీ, అమిత్ షా మాత్రమే లక్ష్యంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
NEET Paper Leak:పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
పరీక్ష పత్రాల లీకేజీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా! ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
NEET Paper Leak Talks: NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
NEET వివాదంపై కేంద్రంతో సీజేపీ చర్చలు - రెండు డిమాండ్లకు ఓకే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే చిక్కుముడి !
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget