అన్వేషించండి

Omicron Cases In India: భారతదేశంలో 161 ఒమిక్రాన్ కేసులు.. వేరియంట్ పై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ ఏమన్నారంటే

భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఉండగా.. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది.

భారత్‌లో 161 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అవసరమైన మందుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం స్టాక్‌ను ఏర్పాటు చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. వచ్చే రెండు నెలల్లో దేశంలో వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని నెలకు 45 కోట్ల డోస్‌లకు పెంచుతామని రాజ్యసభలో చెప్పారు.

"ప్రస్తుతం, భారతదేశంలో 161 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఒమిక్రాన్ పై నిపుణులతో ప్రతిరోజూ మాట్లాడుతున్నాం. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలోని అనుభవంతో, వేరియంట్ స్ప్రెడ్ అయినప్పుడు.. ఎలా ఎదుర్కోవాలో సిద్ధంగా ఉన్నాం. మెడిసిన్ ను స్టాక్ ఉంచుతున్నాం. మందులు, ఆక్సిజన్ సిద్ధంగా ఉన్నాయి.  48,000 వెంటిలేటర్లను రాష్ట్రాలకు పంపిణీ చేశాం." అని మాండవియా చెప్పారు.

అర్హత కలిగిన జనాభాలో 88 శాతం మందికి కొవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్ మరియు 58 శాతం మందికి రెండో డోస్ అందించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అర్థం చేసుకోవడానికి కేంద్రం ఈ అంశంపై రాష్ట్రాలు, నిపుణులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు.

11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది.

ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. వైరస్ కొత్త వేరియంట్ నుంచి రక్షణను అందించడానికి COVID-19 వ్యాక్సిన్‌లను సర్దుబాటు చేయవచ్చు. ఈ కొత్త వేరియంట్ శక్తిమంతమైనది కానట్టు అనిపిస్తుంది. వ్యాక్సిన్‌ వేసుకోవడమే రక్ష. ఇమ్యూనిటీతో ఒమిక్రాన్ నుంచి.. తప్పించుకోవచ్చు. 

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బూస్టర్ షాట్ లపై మాట్లాడారు.   బూస్టర్ షాట్‌ల నిర్వహణను అనుమతించాలని కేంద్రాన్ని కోరారు . ఢిల్లీలో 24 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 పాజిటివ్ అని తేలిన అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆసుపత్రి బెడ్లు, ఆక్సిజన్, మందులకు సంబంధించి.. తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఢిల్లీలో 30,000 కొవిడ్ పడకలు సిద్ధంగా ఉన్నాయని.. 6,800 అదనపు ఐసీయూ పడకలు కూడా త్వరలో సిద్ధమవుతాయన్నారు. 

కర్ణాటకలో మరో ఐదు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 19కి చేరుకుంది. ధార్వాడ్, శివమొగ్గ జిల్లాలోని భద్రావతితోపాటు ఉడిపి, మంగళూరులోనూ కేసులు నమోదయ్యాయి.

Also Read: Engineer Sells Train Engine: ఏకంగా రైలు ఇంజిన్‌నే కొట్టేశారు..! అదెలా అంటారా? అదే అసలు ట్విస్ట్!

Also Read: Omicron Threat: 'అయ్యా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి... బూస్టర్‌కు అనుమతివ్వండి'

Also Read: Coronavirus Update: దేశంలో కొత్తగా 6,563 మందికి కరోనా.. 153కు చేరిన ఒమిక్రాన్ కేసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Common Used Passcodes: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Embed widget