అన్వేషించండి

Kolkata Metro: త్వరలోనే భారత్‌లో తొలి అండర్ వాటర్ మెట్రో, డిసెంబర్ నాటికి వచ్చేస్తుందట!

Kolkata Metro: ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Kolkata Under Water Metro: 

ట్రయల్ రన్ 

1984లో భారత్‌లో తొలి మెట్రో సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి రైల్వే శాఖలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్నో కొత్త ట్రైన్ సర్వీస్‌లు స్టార్ట్ అయ్యాయి. కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లూ పట్టాలెక్కాయి. ఇప్పుడు మరో అతి పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని తొలిసారి అండర్ వాటర్ మెట్రో ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ సర్వీస్‌లు మొదలు కానున్నట్టు గతంలోనే రైల్వే మంత్రి ప్రకటించారు. దేశంలోనే తొలి అండర్​వాటర్​ మెట్రోగా ఇది రికార్డు సృష్టిస్తుందని స్పష్టం చేశారు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిపోతుందని వెల్లడించారు. హుగ్లీ నది కింద ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే...అండర్ వాటర్ టన్నెల్‌లో 6 కోచ్‌లున్న రెండు మెట్రో ట్రైన్‌లను ఈ రోజు (ఏప్రిల్ 9) న టెస్ట్ రన్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కోల్‌కత్తా ఈస్ట్‌ వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ అండర్​వాటర్​ మెట్రోను ఈస్ట్​-వెస్ట్​ కారిడర్​ ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్నారు. సాల్ట్ లేక్ నుంచి హౌరా వరకూ ఈ మెట్రో సర్వీస్‌లు ఉంటాయి. వయా హౌరా ఇది దూసుకుపోతుంది. నిజానికి ఇప్పటికే ఈ పనులు పూర్తవ్వాల్సి ఉంది. కానీ మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. టన్నెల్‌ నిర్మాణం కారణంగా నదీ పరిసరాల్లోని ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని టెక్నికల్ సమస్యలూ రావడం వల్ల పనులు ఆలస్యమవుతూ వచ్చాయి. ప్రజలు ఆందోళనకు గురి కావడం వల్ల కొద్ది రోజుల పాటు పనులు నిలిపివేశారు. 

కిలోమీటర్‌కు రూ.157కోట్లు..

ఎప్సలాండే నుంచి హౌరా మైదాన్ వరకూ దాదాపు 4.8 కిలోమీటర్ల మేర ఈ మెట్రో ట్రైన్‌ల టెస్ట్ రన్ చేసేందుకు ప్లాన్ చేశారు అధికారులు. తొలిసారి 1984లో మెట్రో కోల్‌కత్తాలోని ప్రారంభమైంది. అండర్ వాటర్ ప్రాజెక్ట్‌ కూడా ఇక్కడే మొదలవుతుండటం ఆసక్తికరంగా మారింది. సెక్టార్ V నుంచి సీల్దా మధ్య సెక్షన్ ఇప్పటికే ఆపరేషన్‌కు రెడీగా ఉంది. అయితే సీల్దా నుంచి ఎప్సలాండే మార్గంలో పనులు ఇంకా పూర్తి కాలేదు. 2019 నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కానీ ట్రయల్ రన్ నేపథ్యంలో ప్రస్తుతం టెంపరరీ ట్రాక్స్ వేస్తున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడు ఇవి అందుబాటులోకి వస్తాయన్నది ఇంకా అధికారికంగా చెప్పలేదు. ట్రయల్ రన్‌ సక్సెస్ అయిన తరవాత పరిస్థితులను బట్టి ఆ తేదీలు ప్రకటించే అవకాశముంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. విదేశాల్లో ఇలాంటి అండర్ వాటర్ ప్రాజెక్ట్‌ ఉంది. లండన్‌, పారిస్‌ను కలుపుతూ ఈ ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి కిలోమీటర్‌కి రూ.157 కోట్ల ఖర్చైనట్టు అధికారులు స్పష్టం చేశారు. 

Also Read: US Visa Hike: స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచిన అమెరికా, అప్పటి నుంచే అమల్లోకి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget