అన్వేషించండి

Vande Bharat: ఈ నెలలో పట్టాలెక్కనున్న మరో 4 కొత్త వందేభారత్‌ రైళ్లు-ఎక్కడెక్కడంటే?

జూలై నెలలో మరో నాలుగు కొత్త వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. నెలాఖరులోగా వీటిని ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Vande Bharat: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా క్రమక్రమంగా పెంచుతూ వస్తుంది రైల్వేశాఖ. ప్రధాని మోడీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా ఇప్పటికి  25 వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా...తాజాగా మరో 4 వందేభారత్ రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై నెలాఖరులోనే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ చూస్తోంది. ఈ నాలుగు వందేభారత్ రైళ్లూ ఎనిమిది కోచ్‌లతో నడవనున్నాయి. ఇందులో ఏడు ఛైర్‌ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉండనున్నాయి.

కొత్త వందేభారత్‌ల రూట్లు ఇవే...

తాజాగా ఈ నెలాఖరులోగా ప్రారంభించనున్న వందేభారత్ రైళ్ల రూట్లలో ఢిల్లీ- చండీగఢ్‌, చెన్నై- తిరునల్వేలి, లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్‌, గ్వాలియర్‌- భోపాల్‌ ఉండనున్నాయి. ప్రస్తుతం 25 రైళ్లు నడుస్తుండగా అందులో తొమ్మిది రైళ్లు ఎనిమిదేసి కోచ్‌లతోనే నడుస్తున్నాయి. కొత్త రైళ్లు కలిపితే మొత్తం వందే భారత్‌ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది. ఈ నెలలో ప్రారంభించనున్న ఈ నాలుగు రైళ్లలో ఒక్కొక్క దానిలో 556 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలు ఉంటుంది. ఢిల్లీ చండీగఢ్ రూట్ లో ఇప్పటికే చాలా రైళ్ళు ఉన్నప్పటికీ, ప్రయాణికుల నుండి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ రూట్లో వందే భారత్ ట్రైను ను తీసుకువస్తున్నారు. లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్‌ వందే భారత్‌ రూట్‌లో కొత్త రైలు తేవడం ద్వారా యూపీలో ఈ రైళ్ల సంఖ్య మూడుకు చేరనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌- భోపాల్‌ మధ్య వందే భారత్‌ రైలును తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.

ఇక తెలుగు రాష్ట్రాలలో చెన్నై- తిరుపతి లేదా చెన్నై- విజయవాడ మధ్య వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలకు మాత్రం వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. చెన్నై తిరునల్వేలి మధ్య వందేభారత్ రైలు తీసుకురావడంతో ఈ దఫాలో తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు లేనట్టేనని సమాచారం. ఇక, తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్‌ ఎప్పుడనేది చూడాల్సి ఉంది. మరోవైపు, ఇప్పటివరకు 25 వందేభారత్ లను ప్రవేశపెట్టినా అనుకున్నంత ఆదరణ పొందలేదని, అందువల్ల కెపాసిటీ పెంచుకునేందుకు టికెట్‌ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేవలం వందే భారత్‌ రైళ్లు మాత్రమే కాకుండా ఛైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ తరగతులు కలిగిన అన్ని రైళ్లలో 25 శాతం వరకు టికెట్‌ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్‌ ధరలపై నిర్ణయం జోనల్‌ స్థాయి అధికారులకు రైల్వే బోర్డు అప్పగించింది.

త్వరలో కాషాయరంగులో రైళ్లు..

ఇప్పటి వరకు నీలిరంగులో ఉన్న వందేభారత్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. ఇక, త్వరలో జాతీయ పతాకంలోని కాషాయం రంగులో ఉన్న వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. ఇటీవల చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ రైళ్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Affordable 7 Seater Cars: 10 లక్షల రూపాయల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే.. ఫ్యామిలీ జర్నీకి తిరుగులేదు
10 లక్షల రూపాయల్లో బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే.. ఫ్యామిలీ జర్నీకి తిరుగులేదు
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget