అన్వేషించండి

ప్రధాని మోదీ రిక్వెస్ట్ చేస్తేనే జిన్‌పింగ్‌ కలిశారు, చైనా ప్రకటన - భారత్ అసహనం

Modi Jinping Meet: ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Modi Jinping Meet: 


సరిహద్దు వివాదం..

భారత్, చైనా మధ్య దాదాపు రెండేళ్లుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంటోంది భారత సైన్యం. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అయితే...ఈ సమావేశంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే చైనా అధ్యక్షుడు మోదీతో భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం గట్టిగా స్పందించింది. చైనా కోరింది కాబట్టే ప్రధాని, చైనా అధ్యక్షుడితో సమావేశమయ్యారని చెబుతోంది. చాలా రోజులుగా చైనా ఈ భేటీ కోసం ఎదురు చూస్తోందని, అందుకే మోదీ సౌతాఫ్రికాలో షెడ్యూల్ చేశారని వివరిస్తోంది. జొహన్నస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఇద్దరు నేతలు అత్యంత రహస్యంగా మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

"మా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశం జరిగింది."

- చైనా విదేశాంగ శాఖ

కీలక భేటీ..

ఈ భేటీలో ఇద్దరు నేతలూ సరిహద్దు వద్ద ఉద్రిక్తతల్ని తగ్గించడంపై చర్చించారని తెలుస్తోంది. 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఈ వివాదం ముదిరింది. దాదాపు 19 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఇంకా ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరలేదు. ఇలాంటి కీలక తరుణంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ భేటీ అవ్వడం చర్చకు దారి తీసింది. 

"బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ ఇక్కడికి వచ్చారు. అదే సమయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఇతర బ్రిక్స్ దేశాల నేతలతోనూ ప్రధాని సమావేశమయ్యారు. చైనా విషయానికొస్తే..LAC వద్ద ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి చెక్ పెట్టాలని ప్రధాని మోదీ జిన్‌పింగ్‌తో చెప్పారు"

- వినయ్ ఖ్వాత్రా, భారత విదేశాంగ శాఖ సెక్రటరీ  

ఈ భేటీపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పందించారు. శాంతియుత వాతావరణం నెలకొనాలంటే రెండు వైపులా ప్రయత్నాలు జరగాలని తేల్చిచెప్పారు. 

"చైనా భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవ్వాలంటే సరిహద్దు ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. రెండు దేశాల ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. ప్రపంచ అభివృద్ధికీ రెండు దేశాలు తోడ్పడాలి"

-జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
Karnataka CM Resignation: కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
కర్ణాటక నెక్ట్స్ సీఎం చాన్స్ కోసం ఖర్గే ప్రయత్నం - రేసులో శివకుమార్ ముందంజ - కర్ణాటకలో ఏం జరుగుతోందంటే ?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Embed widget