అన్వేషించండి

యుద్ధమే కోరుకుంటే మీ ఖర్మ, టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్

టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు యుద్ధమే కోరుకుంటే...చివరకు వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

టెర్రరిస్టులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులు యుద్ధమే కోరుకుంటే... చివరకు వారి పిల్లలను వేరే వాళ్లు పెంచాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇండియా శత్రువులు తమ దేశ పురోగతిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇది సరికొత్త భారత్‌ అన్న ఆయన, బెదిరింపులకు భయపడేదిలేదని, వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక యుద్ధాలను చూసిన భారత్‌, వాటిని కోరుకోవడం లేదన్నారు. ఎవరైనా యుద్ధాన్నే కోరుకుంటే మాత్రం తాము వెనుకంజ వేయబోమన్నారు. తాము యుద్ధం చేస్తే... శత్రువులు వారి పిల్లల్ని ఇతరులు పెంచాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చించారు. తమ సైన్యం వద్ద అత్యాధునిక సాంకేతికత, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలున్నాయని... ఈ విషయాన్ని శత్రువులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 

జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. 5 రోజులుగా ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌  కొనసాగుతూనే ఉంది. కొండ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులను  ఏరివేత కోసం ఆర్మీ ముమ్మరంగా విరామం లేకుండా శ్రమిస్తోంది.  అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థను రంగంలోకి దించింది. గఢాల్‌ అడవుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని కచ్చితంగా కనిపెట్టేందుకు సైన్యం డ్రోన్లను రంగంలోకి దించింది. డ్రోన్లతో చేసిన సర్వే ఆధారంగా తీవ్రవాదులు దాక్కొన్న ప్రాంతంపై సైన్యం మోర్టార్‌ షెల్స్‌తో దాడి చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగిన న్‌కౌంటర్‌లోనే కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్‌ ధోనక్‌, డీఎస్పీ హుమాయున్‌ భట్‌, రాష్ట్రీయ రైఫిల్‌ సైనికుడు రవికుమార్‌ మృతి చెందారు. 

కొకెర్‌నాగ్‌ సమీపంలో మొదలైన ఎన్‌కౌంటర్లో అధికారుల విషాదగాథలు వెలుగులోకి వస్తున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో తాను బతకనన్న విషయం  డీఎస్పీ హుమయూన్ అర్థమైపోయింది. హుమయూన్‌ భట్‌ తుదిశ్వాస విడవడానికి ముందు.. గాయాలతోనే తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. తొలుత తన తండ్రి, రిటైర్డ్‌ ఐజీ గులాం హసన్‌ భట్‌ తో మాట్లాడారు. తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని కుటుంబసభ్యులకు చెప్పారు. 

ఉరి సెక్టార్‌లోనూ భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో...సైన్యం, జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరి మృతదేహాలను సైన్యం స్వాధీనం చేసుకున్నారు.  మూడో ముష్కరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో... పాకిస్తాన్ వైపు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఇండియన్ ఆర్మీలోని కొందరు సైనికులకు గాయాలయ్యాయి. 

పీర్‌పంజాల్‌ పర్వత శ్రేణులు ఉన్న పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగాయి. పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటుకొని వచ్చిన ఉగ్రవాదులు,  శ్రీనగర్‌ లేదా డోడా వెళ్లాలన్నా అనంతనాగ్‌ మీదుగానే ప్రయాణించాలి. దీంతో ఉగ్రవాదులకు ఇది ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్‌ పంజాల్‌ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. బనిహాల్‌, హాజిపీర్‌, పీర్‌పంజాల్‌ పాస్‌లు అత్యంత కీలకం.  15 వేల అడుగుల ఎత్తుండే...ఈ పర్వతశ్రేణుల సైనిక అపరేషన్ల చేపట్టాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. 
Also Read: వేరే మతాల గురించి అలా మాట్లాడే ధైర్యముందా? ఉదయనిధి స్టాలిన్‌ని నిలదీసిన నిర్మలా సీతారామన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Embed widget