అన్వేషించండి

కర్ణాటకలో హనుమాన్ జెండా వివాదం, కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ - రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

Hanuman Flag Row: కర్ణాటకలో హనుమాన్ జెండా వివాదం రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది.

Hanuman Flag Row: హనుమాన్ జెండా కర్ణాటకలో కాంగ్రెస్,బీజేపీ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలకు దారి తీసింది. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కెరగొడు గ్రామంలో కొందరు 108 అడుగుల పోల్‌ పెట్టి దానిపై హనుమాన్ జెండా ఎగరేశారు. గత వారం ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య రగడ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు పెరగడం వల్ల పోలీసులు ఆ గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. జెండా ఎగరేసేందుకు గ్రామ పంచాయతీ అనుమతినిచ్చినప్పటికీ కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే ఆ జెండాని తొలగించాలని కొందరు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే...గ్రామస్థులు మాత్రం అందుకు అంగీకరించలేదు. కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. జెండాని తొలగించకుండా ఆందోళనలు నిర్వహించారు. గ్రామస్థులకు బజ్‌రంగ్‌ దళ్‌ కార్యకర్తలు మద్దతు పలికారు.  ఫలితంగా...ఈ వివాదం మరింత రాజుకుంది. అటు బీజేపీ,జేడీఎస్ కార్యకర్తలూ ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ అల్లర్లు మరింత పెరగకుండా పోలీసులు భారీ ఎత్తున గ్రామంలో మొహరించారు. ఈ నిరసనలో భాగంగా గ్రామంలో చాలా మంది దుకాణాలు మూసేశారు. గ్రామ పంచాయతీ అధికారులు జెండాని తొలగించేందుకు ప్రయత్నించడం వల్ల ఘర్షణలు మరింత పెరిగాయి. "గో బ్యాక్" అంటూ గ్రామస్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్యానర్లను ధ్వంసం చేయడం వల్ల ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది. ఆ అల్లర్ల మధ్యే గ్రామ పంచాయతీ అధికారులు జెండాని తొలగించారు. ఫలితంగా..బీజేపీతో పాటు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లోనూ నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ

ప్రభుత్వంపై ఆగ్రహం..

జెండాని తొలగించిన సమయంలో గ్రామస్థులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. హనుమాన్ జెండా స్థానంలో జాతీయ జెండాని ఎగరేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. హిందూ వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. కాషాయ జెండాకి బదులుగా జాతీయ జెండాని ఎగరేయాల్సింది అని స్పష్టం చేశారు. జాతీయ జెండా ఎగరేయాలని తానే అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. 

"బహుశా దీని వెనక రాజకీయాలు ఉండొచ్చు. ఎవరు ఇదంతా చేస్తున్నారో తెలియదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఆధారంగా ఈ దేశం నడుచుకుంటోంది. రేపు ఎక్కడ పడితే అక్కడ కాషాయ జెండాలు ఎగరేస్తారేమో..? అలా ఎలా అనుమతిస్తాం. ఒక్క చోట అనుమతినిస్తే అన్ని చోట్లా అదే జరుగుతుంది. మనోభావాలు దెబ్బ తీయడం మా ఉద్దేశం కాదు. ఆలయానికి సమీపంలో హనుమాన్ జెండాని ఎగరేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకు ఏర్పాట్లు కూడా చేశాం"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills Bypoll 2025 Date:జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
177 Crores Acre: ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
Nara Lokesh:  ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
HYDRA: చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
Advertisement

వీడియోలు

Pakistan Fielding Women's ODI World Cup | ట్రోల్ అవుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్
Kranti Goud India vs Pakistan ODI | బౌలింగ్ తో అదరగొట్టిన క్రాంతి గౌడ్
Ind vs Pak ODI Women's WC 2025 | పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విక్టరీ
India vs Pakistan Shake Hand Controversy | వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills Bypoll 2025 Date:జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు మోగిన నగరా - పోలింగ్ సహా పూర్తి షెడ్యూల్ ఇదిగో !
177 Crores Acre: ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
Nara Lokesh:  ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
HYDRA: చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
చెరువుల పునరుద్దరణ చూస్తుంటే ముచ్చటేస్తోంది!హైడ్రాను ప్రశంసించిన హైకోర్టు న్యాయమూర్తి
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 29 రివ్యూ... ఇమ్యూనిటీ టాస్కులో ఫేవరిజంతో రచ్చ... మేల్ కంటెస్టెంట్స్‌ను కడిగిపారేసిన దివ్య, శ్రీజ... ఈ వారం నామినేషన్ల లిస్ట్
బిగ్‌బాస్ డే 29 రివ్యూ... ఇమ్యూనిటీ టాస్కులో ఫేవరిజంతో రచ్చ... మేల్ కంటెస్టెంట్స్‌ను కడిగిపారేసిన దివ్య, శ్రీజ... ఈ వారం నామినేషన్ల లిస్ట్
Visakhapatnam Crime News: కొడుకు వినడం లేదని, అప్పుచేసి మరీ రూ.3 లక్షల బైక్ కొనిస్తే.. కడుపుకోత మిగిల్చాడు..
కొడుకు అడిగాడని, అప్పుచేసి మరీ రూ.3 లక్షల బైక్ కొనిస్తే.. కడుపుకోత మిగిల్చాడు
YS Jagan: ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
Supreme Court On Unclaimed Amount: క్లెయిమ్ చేయని నగదు రూ.3.5 లక్షల కోట్లు.. కేంద్రానికి, పలు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు
క్లెయిమ్ చేయని నగదు రూ.3.5 లక్షల కోట్లు.. కేంద్రానికి, పలు సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు
Embed widget