అన్వేషించండి

Waqf Bill: వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టిన కేంద్రం, ప్రతిపక్షాల నిరసనలతో హోరెత్తిన లోక్‌సభ

Parliament Session: లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష ఎంపీలు దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమని మండి పడ్డారు.

Waqf Bill in Lok Sabha: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బిల్లుని (Waqf (Amendment) Bill, 2024) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇకపై వక్ఫ్ బోర్డుల అధీనంలో ఉండే ఆస్తులన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉండేలా ఈ బిల్లులో మార్పులు చేశారు. అయితే...ఈ బిల్లుపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నినదించారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది రాజ్యాంగంపైన దాడి చేయడమే అని తేల్చి చెప్పారు. ముస్లిమేతరులను కూడా వక్ఫ్ కౌన్సిల్‌లో సభ్యులుగా చేర్చడాన్నీ తప్పుబట్టారు. ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని మండి పడ్డారు. ముస్లింల తరవాత క్రిస్టియన్లు, జైనులు..ఇలా వరస పెట్టి మిగతా మతాల వాళ్ల హక్కుల్ని అణిచివేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాల్ని దేశ ప్రజలు సహించరని తేల్చిచెప్పారు. (Also Read: Vinesh Phogat: వినేశ్ ఫోగట్‌ అనర్హతా వేటుపై రాజ్యసభలో రగడ, ఇండీ కూటమి నేతలు వాకౌట్ - ఛైర్మన్ తీవ్ర అసహనం)

"మేమంతా హిందువులమే. కానీ మిగతా మతాల పట్ల మాకు విశ్వాసం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. కేవలం మహారాష్ట్ర, హరియాణాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇప్పటికే భారత దేశ ప్రజలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మీకు తగిన పాఠం చెప్పారు. ఫెడరల్ వ్యవస్థపైనే మీరు దాడి చేస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోండి"

- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ

అసదుద్దీన్ అసహనం..

ఈ బిల్లుపై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15 లను ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని మండి పడ్డారు. ఇలాంటి చట్టాలతో దేశాన్ని విడగొడుతున్నారని ఆరోపించారు. ముస్లింలను బీజేపీ శత్రువులుగా చూస్తోందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక వక్ఫ్ బోర్డ్ పరిధిలోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రం ఓ ఆన్‌లైన్ పోర్టల్ తీసుకొస్తుంది. మరో ప్రతిపాదన ఏంటంటే...సెంటర్ వక్ఫ్ కౌన్సిల్‌తో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. అందులో ముస్లిం మహిళలతో పాటు ముస్లిమేతరులూ సభ్యులుగా ఉంటారు. ఈ చట్టం అమలు బాధ్యత అంతా ఆయా జిల్లాల కలెక్టర్లపైనే ఉంటుంది. అది వక్ఫ్ ఆస్తులా లేదా ప్రభుత్వ భూములా అన్న విషయంలో కలెక్టర్లు మధ్యవర్తులుగా ఉండి ఆ సమస్యని పరిష్కరిస్తారు. 

Also Read: Viral News: క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీస్ సాహసం, బిజీ రోడ్డుపై ప్రాణాలకు తెగించి - వీడియో

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget