అన్వేషించండి

Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Atul Subhash Suicide Case:యువతపై ఇలాంటి మానసిక, ఆర్థిక ఒత్తిడి ఉండకూడదన్నారు. జీతం కంటే మూడింతలు ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తుంటే ఎవరికైనా భరించలేని పరిస్థితి ఎదురవుతుంది.

Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భార్యాభర్తల మధ్య టెన్షన్ ఏ స్థాయికి చేరుతుందనేది ఈ ఘటన తర్వాత ప్రతి ఒక్కరి మదిలో తలెత్తింది. 498(A) చట్టం కూడా చర్చకు దారితీసింది.  బెంగళూరు ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఈ ఘటన బాధాకరమని, హృదయవిదారకంగా ఉందని కంగనా పేర్కొంది. అలాగే, ఈ ఆత్మహత్యకు కొన్ని సామాజిక, వ్యక్తిగత కారణాలే కారణమన్నారు. 99 శాతం పెళ్లిళ్లలో పురుషుల తప్పిదమే జరుగుతుందని, అందుకే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని కంగనా చెప్పింది. అయితే కంగనా చేసిన ఈ ప్రకటన వివాదాస్పదం కానుంది. 

99శాతం వారిదే తప్పు
ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా సమీక్ష జరపాలని బీజేపీ ఎంపీ కంగనా అన్నారు. ఇలాంటి ఘటనలను ఎదుర్కోవడానికి ప్రత్యేక సంస్థ ఉండాలన్నారు.  కంగనా మాట్లాడుతూ.. ‘‘అతని వీడియో హృదయ విదారకంగా ఉంది. పెళ్లికి సంబంధించిన వ్యక్తులు వ్యాపారం చేయడం మూలాన ఇదంతా జరిగింది, యువతపై ఇలాంటి భారం పడకూడదు. అబ్బాయి ఒత్తిడి కారణంగానే ఇలా చేశాడు. భారతీయ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగడం మంచిదన్నారు.  కానీ వివాహంలో కమ్యూనిజం, సోషలిజం, తప్పుడు స్త్రీవాదం  ప్రభావం పెరిగినప్పుడు, అది సంబంధాలను వాణిజ్య రూపంలోకి మారుస్తుంది. వాళ్లు దాని నుంచి డబ్బులను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. సమాజంలో ప్రస్తుతం ఫేక్ ఫెమినిజం అనేక సమస్యలను సృష్టిస్తుంది. ప్రతిరోజూ వేధింపులకు గురవుతున్న స్త్రీల సంఖ్యను కూడా మనం విస్మరించలేము, 99 శాతం వివాహాలలో పురుషులు తప్పు చేస్తున్నారు, అందుకే అలాంటి తప్పులు కూడా జరుగుతాయి.’’ అని కంగనా రనౌత్ అన్నారు. 

Also Read : Gita Parayanam: గీతా పారాయణం చేసిన 7వేల మంది, కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్

వీడియో హృదయ విదారకం
అతుల్ సుభాష్ వీడియో, సూసైడ్ నోట్ చాలా హృదయ విదారకంగా ఉన్నాయని కంగనా పేర్కొంది. యువతపై ఇలాంటి మానసిక, ఆర్థిక ఒత్తిడి ఉండకూడదన్నారు. జీతం కంటే మూడింతలు ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తుంటే ఎవరికైనా భరించలేని పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఒత్తిడి అతుల్ సుభాష్‌పై ఎక్కువగా ఉంది. అందుకే తను ఈ చర్యకు పూనుకున్నాడు. అటువంటి కేసులను పరిశీలించి బాధితులకు సహాయం అందించే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడం గురించి కూడా కంగనా మాట్లాడారు. 

పురుషులపై వేధింపుల విషయంపై కంగనా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ‘‘ప్రతిరోజూ వేధింపులకు గురవుతున్న మహిళల సంఖ్యను ఒక తప్పుడు స్త్రీని ఉదాహరణగా తీసుకొని కాదనలేము. 99 శాతం వివాహాలలో పురుషుల తప్పు ఉంది. అందుకే అలాంటి తప్పులు జరుగుతాయి.’’ అన్నారు.

 అసలు ఏమైందంటే.. 
బెంగుళూరు ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య గురించి కూడా కంగనా మాట్లాడారు. చనిపోయే ముందు, అతుల్ గంటన్నర నిడివిగల వీడియోను రూపొందించాడు. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అతను తన భార్యను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించాడు. ఇది కాకుండా, అతుల్ 24 పేజీల సూసైడ్ నోట్‌ను కూడా రాశాడు. అందులో తన భార్య చేసిన వేధింపుల వల్ల కలత చెందానని, కోర్టు కూడా తన భార్య పక్షం వహిస్తుందని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత, ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఇందులో చట్టపరమైన ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read : Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget