అన్వేషించండి

Elon Musk China Visit: భారత్ పర్యటన రద్దు తరవాత చైనాకి వెళ్లిన మస్క్, ఏం ప్లాన్ చేస్తున్నారు?

Elon Musk: భారత్‌ పర్యటనను రద్దు చేసుకున్న టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఉన్నట్టుండి చైనా పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

Elon Musk Heads To China: ఇండియాలో టెస్లా మార్కెట్‌కి అంతా (Tesla in India) లైన్ క్లియర్ అయింది అనుకునేలోగా ఎలన్ మస్క్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భారత్‌ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కావాల్సి ఉన్నా అది కూడా రద్దైంది. త్వరలోనే ఇండియాకి వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు మస్క్. కానీ...ఇప్పుడు ఆయన చైనా మార్కెట్‌పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ మార్కెట్‌ డల్ అయింది. టెస్లా కార్ల సేల్స్‌ చైనాలో బాగా పడిపోయాయి. అందుకే అక్కడి మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు చైనా వెళ్లారు మస్క్. నిజానికి ఇది ఎవరూ ఊహించలేదు. భారత్‌కి వస్తారనుకున్న ఆయన ఉన్నట్టుండి చైనాకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఎలన్ మస్క్ బీజింగ్‌లోని ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి. Full-Self Driving (FSD) సాఫ్ట్‌వేర్‌ ఉన్న కార్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు అనుమతి అడగనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ కోసం తీసుకున్న డేటాకి అప్రూవల్‌ కావాలని కోరనున్నారు. 

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు..

అయితే...ఇటీవలే X వేదికగా ఓ నెటిజన్ ఎలన్ మస్క్‌ని ఓ ప్రశ్న అడిగాడు. చైనాలో FSD కార్స్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రశ్నించాడు. అందుకు మస్క్ "త్వరలోనే" అని బదులిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన చైనాకి వెళ్లడం వల్ల త్వరలోనే అక్కడి మార్కెట్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థవుతోంది. Reuters వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే...2021 నుంచి చైనాలో FSDకి అవసరమైన డేటానంతా సేకరించింది టెస్లా. అయితే...పూర్తి స్థాయిలో దాన్ని బదిలీ చేయాలంటే అక్కడి అధికారుల అనుమతి అవసరం. నాలుగేళ్ల క్రితమే ఈ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్‌ కార్‌లను తయారు చేసింది టెస్లా. ఇప్పుడు చైనాలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

భారత్‌లో పెట్టుబడుల సంగతేంటి..?

భారత్‌లో రూ.25 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు ఎలన్ మస్క్. అంతకు ముందు భారత్‌తో చాలా చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఈవీ కార్‌ల దిగుమతిపై భారత్ భారీ సుంకాలు విధిస్తున్న అంశంపై చాలా సార్లు చర్చలు జరపాల్సి వచ్చింది. ఎవరికోసమో నిబంధనలు మార్చలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఫలితంగా 100% దిగుమతి సుంకంతో భారత్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టలేక టెస్లా ఆగిపోయింది. ఆ తరవాత భారత్‌ మనసు మార్చుకుంది. దిగుమతి సుంకాన్ని 15%కి తగ్గించింది. ఈ మేరకు కొత్త ఈవీ పాలసీని తయారు చేసింది. ఇది టెస్లాకి ప్లస్ అయింది. వెంటనే భారత్‌తో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఢిల్లీలో లేదా ముంబయిలో ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు మస్క్ మోదీతో భేటీ అయ్యి ఆ తరవాత రూట్‌మ్యాప్‌ని ప్రకటించాలని భావించారు. కానీ టెస్లాలో చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయని..అందుకే భారత్‌కి రాలేకపోతున్నానని ప్రకటించారు. ఇప్పుడు చైనా మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. 

Also Read: Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget