అన్వేషించండి

Elon Musk China Visit: భారత్ పర్యటన రద్దు తరవాత చైనాకి వెళ్లిన మస్క్, ఏం ప్లాన్ చేస్తున్నారు?

Elon Musk: భారత్‌ పర్యటనను రద్దు చేసుకున్న టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఉన్నట్టుండి చైనా పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

Elon Musk Heads To China: ఇండియాలో టెస్లా మార్కెట్‌కి అంతా (Tesla in India) లైన్ క్లియర్ అయింది అనుకునేలోగా ఎలన్ మస్క్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భారత్‌ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కావాల్సి ఉన్నా అది కూడా రద్దైంది. త్వరలోనే ఇండియాకి వచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు మస్క్. కానీ...ఇప్పుడు ఆయన చైనా మార్కెట్‌పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ మార్కెట్‌ డల్ అయింది. టెస్లా కార్ల సేల్స్‌ చైనాలో బాగా పడిపోయాయి. అందుకే అక్కడి మార్కెట్‌ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు చైనా వెళ్లారు మస్క్. నిజానికి ఇది ఎవరూ ఊహించలేదు. భారత్‌కి వస్తారనుకున్న ఆయన ఉన్నట్టుండి చైనాకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఎలన్ మస్క్ బీజింగ్‌లోని ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి. Full-Self Driving (FSD) సాఫ్ట్‌వేర్‌ ఉన్న కార్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు అనుమతి అడగనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ కోసం తీసుకున్న డేటాకి అప్రూవల్‌ కావాలని కోరనున్నారు. 

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు..

అయితే...ఇటీవలే X వేదికగా ఓ నెటిజన్ ఎలన్ మస్క్‌ని ఓ ప్రశ్న అడిగాడు. చైనాలో FSD కార్స్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ప్రశ్నించాడు. అందుకు మస్క్ "త్వరలోనే" అని బదులిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన చైనాకి వెళ్లడం వల్ల త్వరలోనే అక్కడి మార్కెట్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థవుతోంది. Reuters వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే...2021 నుంచి చైనాలో FSDకి అవసరమైన డేటానంతా సేకరించింది టెస్లా. అయితే...పూర్తి స్థాయిలో దాన్ని బదిలీ చేయాలంటే అక్కడి అధికారుల అనుమతి అవసరం. నాలుగేళ్ల క్రితమే ఈ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్‌ కార్‌లను తయారు చేసింది టెస్లా. ఇప్పుడు చైనాలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

భారత్‌లో పెట్టుబడుల సంగతేంటి..?

భారత్‌లో రూ.25 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు ఎలన్ మస్క్. అంతకు ముందు భారత్‌తో చాలా చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఈవీ కార్‌ల దిగుమతిపై భారత్ భారీ సుంకాలు విధిస్తున్న అంశంపై చాలా సార్లు చర్చలు జరపాల్సి వచ్చింది. ఎవరికోసమో నిబంధనలు మార్చలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఫలితంగా 100% దిగుమతి సుంకంతో భారత్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టలేక టెస్లా ఆగిపోయింది. ఆ తరవాత భారత్‌ మనసు మార్చుకుంది. దిగుమతి సుంకాన్ని 15%కి తగ్గించింది. ఈ మేరకు కొత్త ఈవీ పాలసీని తయారు చేసింది. ఇది టెస్లాకి ప్లస్ అయింది. వెంటనే భారత్‌తో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఢిల్లీలో లేదా ముంబయిలో ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు మస్క్ మోదీతో భేటీ అయ్యి ఆ తరవాత రూట్‌మ్యాప్‌ని ప్రకటించాలని భావించారు. కానీ టెస్లాలో చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయని..అందుకే భారత్‌కి రాలేకపోతున్నానని ప్రకటించారు. ఇప్పుడు చైనా మార్కెట్‌పై ఫోకస్ పెట్టారు. 

Also Read: Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget