అన్వేషించండి

Kerala Tragedy: వయనాడ్ విలయంలో ఆసక్తికర ఘటన, ప్రాణాలు కాపాడిన గజరాజు - రాత్రంతా బాధితులకు అండగా కాపలా

Wayanad: వయనాడ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళ, చిన్నారిని ఓ ఏనుగు కాపాడింది. రాత్రంతా వాళ్లకు కాపలాగా ఉంటూ ఏమీ కాకుండా చూసుకుంది.

Wayanad Landslides: వయనాడ్‌లో బాధితుల కథలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. చావు అంచు వరకూ వెళ్లి అదృష్టవశాత్తూ తప్పించుకుని వచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. బతికి బయట పడ్డాక వాళ్లు పడ్డ నరక యాతన గురించి చెబుతుంటే మనసు కదిలిపోతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళ ఈ విపత్తు నుంచి ఎలా తప్పించుకుని బయటపడిందో చెప్పింది. తన మనవరాలితో కలిసి రాత్రంతా వణికిపోతూ ఉండిపోయిన ఆమె అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకుంది. ఆమె ఇలా బతికి బట్టకట్టడానికి ఓ ఏనుగు సాయం చేసిందట. ముందు రోజు రాత్రి ఏం జరిగిందో ఆమె వివరిస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. 

ఏం జరిగిందంటే..

జులై 30వ తేదీన సుజాత ఇంట్లో నిద్రపోతోంది. ఉన్నట్టుండి ఆ సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి. కళ్లు తెరిచి చూడగానే పెద్ద ఎత్తున బురద తన ఇంటిని ముంచేస్తున్నట్టు అర్థమైంది. నిముషాల్లోనే పైకప్పు కూలిపోయింది. ఆమె పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఏదో విధంగా అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆమె తన మనవరాలిని ఎత్తుకుని బయట పడింది. 

"నా మనవరాలిని ఎత్తుకున్నాను. బయట పడే సమయంలో ఓ భారీ కొమ్మ ఎదురుగా వచ్చింది. ఎలాగోలా తప్పించుకుని ఈదుకుంటూ వచ్చాను. మనవరాలిని గట్టిగా పట్టుకున్నాను. కాసేపటికి అక్కడి నుంచి బయటపడ్డాం. ఇక బతికిపోయాం అనుకుంటూ ఓ కాఫీ తోటలోకి వెళ్లాను. సాయం కోసం చాలా ఎదురు చూశాను. సరిగ్గా అదే సమయంలో మూడు భారీ ఏనుగులు నా ముందుకు వచ్చి నిలబడ్డాయి. అప్పటి వరకూ కాస్త ఊపిరి పీల్చుకున్న నాకు మళ్లీ భయం మొదలైంది. ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోయాను. దయచేసి ఏమీ చేయొద్దని ఆ ఏనుగులను వేడుకున్నాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. మెల్లగా ఓ చెట్టు కింద తలదాచుకున్నాను. మా ఇద్దరికీ ఏమీ కాకుండా ఓ ఏనుగు వచ్చి మాకు అండగా నిలబడింది. తెల్లవారుజామున రెస్క్యూ టీమ్ వచ్చి మమ్మల్ని కాపాడే వరకూ అలాగే మమ్మల్ని రక్షించింది"

- బాధితురాలు

ఇదంతా వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదా. సాధారణంగా ఏదైనా తోటలోకి వెళ్లాయంటే ఏనుగులు ధ్వంసం చేసేస్తాయి. గట్టిగా ఘీంకరిస్తాయి. కానీ అదేమీ చేయకుండా ఆ మహిళని, చిన్నారికి అండగా నిలబడడం నిజంగా అద్భుతమే. అందుకే ఆ ఏనుగుని తలుచుకుని భావోద్వేగానికి గురవుతోంది బాధితురాలు. ఈ విపత్తుతో చూరల్‌మల్‌ ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. అక్కడే బాధితురాలు సుజాత ఇల్లు కూడా ఉంది. కూలిపోతున్న ఇంట్లో నుంచి తన మనవరాలిని తీసుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో ఏ మాత్రం ధైర్యం చేయకపోయినా ప్రాణాలు పోయేవని చెబుతోంది. ఇరుగు పొరుగున ఎవరూ సాయం చేయడానికి కూడా లేరని వివరించింది. అంతా నదిలో కొట్టుకుపోయిందని, కను చూపు మేరలో బురద తప్ప ఏమీ లేదని వెల్లడించింది. తమ ఇంటికి దగ్గర్లోనే కొడుకు, కోడలు ఉన్నారని చెప్పింది. ప్రస్తుతానికి వాళ్లంతా మెప్పడిలోని రిలీఫ్ క్యాంప్‌లో తలదాచుకున్నారని తెలిపింది. 

Also Read: Kerala: ఈ ఫొటోలు చూశాక ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయకుండా ఉండలేం, వయనాడ్ హీరోలు వీళ్లే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Dussehra 2024: అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
Embed widget