అన్వేషించండి

Election Commission: 5 రాష్టాల ఎన్నికలు - రూ.1760 కోట్లు పట్టివేత, అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే.?

Money Seized: 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో ఇప్పటివరకూ రూ.1760 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Money Seized During Five States Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కఠినంగా వ్యవహరిస్తోంది. ఓటర్లకు ప్రలోభాల విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసుల సమన్వయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా భారీగా అక్రమ నగదు పట్టుబడింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.1760 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపింది. 2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో సీజ్‌ చేసిన దాంతో పోలిస్తే దీని విలువ ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో రూ.239.15 కోట్లు పట్టుబడినట్లు తెలిపింది. అయితే, తెలంగాణలోనే అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్ చేసినట్లు వివరించింది. రాజస్థాన్ లో రూ.650.7 కోట్లు, మధ్యప్రదేశ్ లో రూ.323.7 కోట్లు, ఛత్తీస్ గఢ్ లో రూ.76.9 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడించింది.

ఆ రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

షెడ్యూల్ లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రాజస్థాన్ లో, 30న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తనిఖీల సందర్భంగా తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. మిజోరంలో ఎలాంటి నగదు దొరకలేదని, కానీ రూ.29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తెలంగాణలో సీజ్ చేసిన నగదు మొత్తంలో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, రూ.52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువుల ఉన్నట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. వీటిని సీజ్ చేసినట్లు వివరించారు. ఎన్నికలు ముగిసేనాటికి ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Also Read: Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్ సీఎంకి ప్రధాని మోదీ ఫోన్‌ కాల్, రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Updates: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
America stops attacks on Iran: ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన
ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన
Prime Minister Modi Parliament Speech: 41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
Legend of Durga Bhabhi: విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..
విప్లవ వీరుల 'దుర్గా భాబీ'.. భగత్ సింగ్‌ను కాపాడిన వీరనారి దుర్గావతి గురించి తెలుసా..

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
Embed widget