అన్వేషించండి

Delhi Excise Policy Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు - నిందితుల జాబితాలో కేజ్రీవాల్‌, ఆప్‌ని చేర్చిన ఈడీ

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది.

Delhi Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది ఈడీ. ఇటీవలే మరోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన అధికారులు తొలిసారి కేజ్రీవాల్‌ పేరుని నిందితుల జాబితాలో చేర్చడం కీలకంగా మారింది. ఆయన పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది అక్రమం అని అందులో పేర్కొన్నారు. అయితే...ఈ పిటిషన్‌పై తీర్పుని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ క్రమంలోనే ఈడీ ఆయనతో పాటు ఆప్‌ పేరుని ఛార్జ్‌షీట్‌లో చేర్చడం షాక్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌కి, హవాలా ఆపరేటర్‌లకు మధ్యలో ఛాటింగ్ జరిగిందని, ఆ మెసేజ్‌లన్నీ తమ వద్ద ఉన్నాయని ఈడీ కోర్టుకి వెల్లడించింది. కేజ్రీవాల్‌ తన మొబైల్ పాస్‌వర్డ్‌లు ఇచ్చేందుకు అంగీకరించలేదని వివరించింది. హవాలా ఆపరేటర్స్‌ డివైజ్‌ల నుంచి ఈ ఛాట్‌ని రికవర్ చేసినట్టు స్పష్టం చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ ఛార్జ్‌షీట్‌ని దాఖలు చేసింది. ఈ కేసులో కీలకంగా భావించే కొన్ని డివైజ్‌లను ధ్వంసం చేశారని, హవాలా ఆపరేటర్స్‌ వద్ద ఉన్న డివైజ్‌ల నుంచే అన్ని వివరాలూ  సేకరిస్తున్నామని ఈడీ తెలిపింది.

ఈ స్కామ్‌ మొత్తం సూత్రధారి కేజ్రీవాలేనని ఇప్పటికే ఈడీ కోర్టులో వాదించింది. ఆయన ద్వారానే పెద్ద ఎత్తున  హవాలా లావాదేవీలు జరిగాయని ఆరోపించింది. అయితే...కేజ్రీవాల్ మాత్రం ఇదంతా కుట్ర అని కొట్టి పారేస్తున్నారు. బెయిల్‌ కోసం ఇటీవల  పిటిషన్ వేయగా కోర్టు అందుకు అనుమతినిచ్చింది. జూన్ 2వ తేదీన మళ్లీ ఈడీకి లొంగిపోవాలని ఆదేశించింది. South Group ఇచ్చిన రూ.100 కోట్ల లంచంలో ఆప్ గోవా ఎన్నికల కోసం రూ.45 కోట్లు వినియోగించిందని ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. 2022లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నిధులను డబ్బుని ఖర్చు చేసినట్టు చెబుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌ని కింగ్‌పిన్‌గా పేర్కొంది. హోల్‌సేలర్స్‌కి లాభాలు వచ్చేలా ఆప్ ప్రభుత్వం ప్రాఫిట్ మార్జిన్‌ని 12%కి పెంచినట్టుగా ఆరోపిస్తోంది. అందులో 6% మేర వాటాని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నట్టుగా చెబుతోంది. ఈ డీల్ కారణంగా ప్రభుత్వానికి రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ స్పష్టం చేసింది. ఆప్‌ మీడియా హెడ్ విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారని ఆరోపించింది. 

Also Read: Motion Sickness: మీకు కార్ జర్నీ పడదా, ప్రయాణంలో మొబైల్ చూసినా తల తిరుగుతోందా - ఈ ఫీచర్ మీ కోసమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Hyderabad Crime News:ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
Vizag News: విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
Embed widget