అన్వేషించండి

Digital Credit: ఈ ఏడాది నుంచి డిజిటల్ లోన్స్ ఇస్తాం, చిన్న వ్యాపారులూ తీసుకోవచ్చు - కేంద్ర మంత్రి

Digital Credit: ఈ ఏడాది నుంచి డిజిటల్ రుణాలు ఇస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.

Digital Credit System: 

డిజిటల్ పేమెంట్ ఫెస్టివల్..

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి డిజిటల్ లోన్స్‌ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసినట్టు వెల్లడించింది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదే విషయాన్ని అధికారికంగా చెప్పారు. "Digital Payment Festival" కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ క్రెడిట్ సిస్టమ్‌ ద్వారా బడా బ్యాంకులను చిన్న వ్యాపారులకూ లోన్ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించనున్నట్టు చెప్పారు. యూపీఐ సర్వీస్‌లా త్వరలోనే ఈ సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ "డిజిటల్ ఇండియా" విజన్‌లో భాగంగా ఈ కొత్త పథకం ప్రవేశపెట్టనుంది కేంద్రం. 

"ఈ ఏడాదిలో డిజిటల్ లోన్ సర్వీస్‌ను ప్రారంభిస్తాం. మరో 10-12 ఏళ్లలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరింత బలోపేతమవుతుంది" 

 అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి 

మరింత విస్తృతం..

ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మరో ఫీచర్‌ను లాంచ్ చేశారు. UPIకి సంబంధించి వాయిస్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్‌ ప్రోటోటైప్‌ను ప్రారంభించారు. డిజిటల్ వ్యవస్థను వీలైనంత వరకూ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంతే కాదు. 
స్థానిక భాషల్లోనే యూపీఐ చెల్లింపులు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. తద్వారా మారుమూల ప్రజలు కూడా సులువుగా తమ భాషలోనే అప్లికేషన్‌ను వినియోగించుకోవచ్చని, చెల్లింపులూ సులభంగా చేసే వెసులుబాటు కలుగుతుందని అన్నారు. NPCI సేవల్ని విస్తృతం చేయడంతో పాటు మరి కొన్ని విధానాలనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇదే ఈవెంట్‌కు హాజరైన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ అల్కేశ్ కుమార్ శర్మ కూడా పాల్గొన్నారు. త్వరలోనే UPIని గ్లోబల్ పేమెంట్‌ ప్రొడక్ట్‌గా మార్చుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే NPCI నేపాల్, సింగపూర్, భూటాన్ లాంటి దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుందని చెప్పారు. ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్‌కాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యూకే, యూఎస్‌ఏ దేశాల్లోని NRIలు కూడా ఈ యూపీఐ ద్వారానే చెల్లింపులు చేసుకునేలా చర్యలు చేపట్టనుంది కేంద్రం. త్వరలోనే G-20 సమావేశానికి నేతృత్వం వహించనున్న భారత్...డిజిటల్ ఇండియా నినాదాన్ని బలంగా వినిపించనుంది. ఆయా దేశాలతో చర్చించి డిజిటల్ సేవల్ని మరింత విస్తృతం చేయనుంది. చిన్న వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు ఇన్‌స్టంట్‌గా లోన్ ఇచ్చేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడనుంది. 

Also Read: ISRO Launch: పడిన చోటే ఎగిరిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2- విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఇస్రో

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget