అన్వేషించండి

Rajanna Dora: సెటిలర్స్ వల్ల అభివృద్ధికి ఆటంకం- సాలూరును గిరిజిన ప్రాంతంగా ప్రకటిస్తామని రాజన్నదొర హెచ్చరిక

Rajanna Dora: గిరిజన గ్రామాల్లో రోడ్లేసినా, వంతెనలు కట్టినా గిరిజనులకు ఉపయోగం తక్కువని, ఎక్కువగా సెటిలర్లే వాడుతుంటారని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర వ్యాఖ్యానించారు.

Rajanna Dora: పార్వతీపురం మన్యం జిల్లా(Parvatipuram Manyam District) సాలూరు(Saluru)లో నివసించే సెటిలర్లపై ఉప ముఖ్యంత్రి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సాలూరు అంతా సెటిలర్ల వల్ల నష్ట పోతుందని రాజన్న దొర అన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లేసినా, వంతెనలు కట్టినా గిరిజనులకు ఉపయోగం తక్కువని, ఎక్కువగా సెటిలర్లే ఉపయోగించు కుంటున్నారని రాజన్న దొర వ్యాఖ్యానించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావుడి, కొట్టు పరువు పంచాయతీల్లో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లుడుతూ.. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారాలు చేస్తున్న సెటిలర్ల వల్లే రోడ్లు నాశనం అవుతున్నాయని అన్నారు. భారీ వాహనాలను తిప్పుతుండటం వల్ల రోడ్లపై గుంతలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇలా పాడైన రోడ్లను బాగు చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని రాజన్న దొర విమర్శించారు. గిరిజనులకు న్యాయం చేసేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని కోరుతాని పేర్కొన్నారు. సాలూరు షెడ్యూల్డ్ ఏరియాగా మారితే సెటిలర్లు నష్ట పోతారని రాజన్న దొర వ్యాఖ్యానించారు. 

గిరిజనుల వద్ద సంపాధించుకుని అభివృద్ధికి సహకరించట్లే..!

చౌదరి, రెడ్డి కులాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఉండటంతో సాలూరు అభివృద్ధిని చౌదరి, రెడ్డిలు అడ్డు కుంటున్నారని డిప్యూటీ సీఎం రాజన్న దొర అసహనం వ్యక్తం చేశారు. సెటిలర్లు అందరూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని రాజన్న దొర మండి పడ్డారు. బబ్లూ అనే వ్యక్తి పేరు సంభోదిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెటిలర్లు గిరిజనుల వద్ద సంపాదించుకుని.. అడవి బిడ్డల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరు మండలం కొట్టు పరువు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో గిరిజనులు రాజన్న దొరను కలిశారు. కొట్టు పరువు నుంచి కందుల పదం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం ఆగి పోయిందని గ్రామస్థులు రాజన్న దొర దృష్టికి తీసుకెళ్లారు. కొట్టు పరువు పంచాయతీలో రోడ్డు వేయాలని చూస్తే ఓ సెటిలర్ ఆపారని, అది సరికాదని రాజన్న దొర అన్నారు. గిరిజిన ప్రాంతాల్లోని మౌలిక వసతులు అన్నింటిని సెటిలర్లే వాడుకుంటున్నారని అన్నారు. 

గిరిజన ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండేందుకు వీలు లేదు

ఈ ప్రాంతాల్లో స్థానికేతరులు వందల ఎకరాల్లో ఎన్నో వాణిజ్య పంటలు పండిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర తెలిపారు. వారు గిరిజన గ్రామానికి నాలుగు అడుగుల భూమిని ఇమ్మంటే వారు ససేమిరా అంటున్నారని రాజన్న దొర అన్నారు. ఇలాంటి ధోరణితో సెటిలర్లు ఉన్నట్లు అయితే గిరిజన ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండడానికి వీలు లేకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ఉప ముఖ్యమంత్రి, సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర హెచ్చరించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Embed widget