అన్వేషించండి

వెలవెలబోతున్న ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీస్‌, తాళం వేసి వెళ్లిపోయారు!

Delhi MCD Election Results 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్ కార్యాలయం మూతబడి ఉంది.

Delhi MCD Election Results 2022:

ఎన్నికల ఫలితాల వేళ..వెలవెల..

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికి తేలిపోనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే...ఆప్ గెలవటం లాంఛనమే అనిపిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికలతో భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. అసలు...ఆ పార్టీ ఊసు కూడా ఎత్తకుండానే ఎన్నికలు జరిగిపోయాయంటే..అతిశయోక్తి కాదు. ఓ వైపు ఢిల్లీ ప్రజలంతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తుంటే...కాంగ్రెస్ ఆఫీస్ మాత్రం వెలవెలబోయింది. పార్టీ ఆఫీస్‌కి తాళం వేసి ఉంది. ఒక్క కార్యకర్త కూడా ఆ చుట్టుపక్కల కనిపించడం లేదు. కనీసం...కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా అక్కడ కనిపించడం లేదు. గేటుకి తాళం వేసి వెళ్లిపోయారు. ఇది చూసిన వాళ్లంతా "ఇదేం చిత్రం" అనుకుంటూ వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ నిరాశావాదానికి ఇదే సాక్ష్యం  అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ...కాంగ్రెస్ పతనమవుతూ వస్తోంది. ఇప్పటికే...గుజరాత్ ఎన్నికల్లో ఆప్ కన్నా వెనకబడి ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ దాదాపు అదే పరిస్థితి ఉంది. ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉంటే...ఇటు ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా వస్తుండటం అధిష్ఠానాన్ని కలవర పెడుతోంది. ఈ మధ్యే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీని పునర్నిర్మించే పని మొదలు పెట్టారు. కానీ...ఇందుకు చాలా సమయం పట్టేలా ఉంది. 

ఖర్గే వార్నింగ్..

మొదటి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ (Congress Steering Committee) సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగత జవాబుదారీతనం పై నుంచి క్షేత్ర స్థాయి వరకు ఉండాలన్నారు. తమ బాధ్యతలను నిర్వర్తించలేని వారు తప్పుకోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో రాబోయే 30 నుంచి 90 రోజుల్లో ప్రజల సమస్యలపై ఉద్యమానికి రోడ్‌ మ్యాప్‌ను సమర్పించాలని ఖర్గే రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను కోరినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. 
" పై నుంచి కింది స్థాయి వరకు సంస్థాగత జవాబుదారీతనం అనేది పార్టీ, దేశం పట్ల మన బాధ్యతలో అతి ముఖ్యమైన భాగం అని నేను నమ్ముతాను. కాంగ్రెస్ బలంగా, జవాబుదారీగా, ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటేనే ఎన్నికల్లో గెలిచి దేశ ప్రజలకు 
సేవ చేయగలం. కీలక పదవుల్లో ఉన్న కొంత మంది పార్టీలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. అలా లేని వారిని పార్టీని కచ్చితంగా విస్మరించాల్సి వస్తుంది. "
-  మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

Also Read: Gujarat Exit Poll 2022: ఎగ్జిట్ పోల్స్ అబద్ధం అని నిరూపిస్తాం, 100 సీట్లు సాధిస్తాం - గుజరాత్ ఫలితాలపై కేజ్రీవాల్

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
BRS vs Congress: రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
రాహుల్ గాంధీని విమర్శిస్తే పెద్ద నేత అయిపోరు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget