Azadpur railway colony: రైల్వే ప్లాట్ఫామ్నే కాలనీగా మార్చుకున్న నిరుపేదలు - ఎక్కడో కాదు ఢిల్లీలోనే !
Delhi railway: ఢిల్లీలో రైల్వే ప్లాట్ఫామ్ను కాలనీగా మార్చుకున్నారు పేరు. ఆజాద్పూర్ స్టేషన్లో ఇళ్లు, షాపులు నిర్మించుకున్నారు. ఇప్పుడు వారిని తరలించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు.

Delhi Azadpur railway station platform colony: దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్పూర్ రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ను స్థానికులు ఇళ్లు, షాపులు నిర్మించుకుని కాలనీలా మార్చేసుకున్నారు. 30 సంవత్సరాలుగా వీరు ఫ్లాట్ ఫామ్ పైనే ఉంటున్నారు. ఇప్పుడు మెట్రో విస్తరణలో భాగంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని అనుకుంటున్నారు.
ఆజాద్పూర్ రైల్వే స్టేషన్ ఢిల్లీలోని ఉత్తర ప్రాంతంలో ఉంది. ఈ స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 1 , ట్రాక్ల సమీపంలో 400కి పైగా అక్రమ ఇళ్లు నిర్మించారు. ఈ ప్రాంతంలో మండీలో పనిచేసే కూలీలు, కార్మికులు, వారి కుటుంబాలు నివసిస్తున్నారు. ప్లాట్ఫామ్పై ఇళ్లు, షాపులు కనిపిస్తూనే ఉంటాయి. రైల్వే ట్రాక్కు సమీపంలోనే ఈ ఇళ్లు ఉన్నాయి. ఈ ఆక్రమణలు 1990ల నుండి కొనసాగుతున్నాయి. స్థానికుల ప్రకారం, వీరు రోజువారీ కూలీలు.ఇక్కడ కూడా అద్దెల దందా ఉంది. ఇళ్లు యజమానులు ఒక్కో రూమ్కు 2,000 నుండి 6,000 రూపాయల వరకు రెంట్ వసూల్ చేస్తున్నారు. ఈ ప్రాంతం రైల్వే సిగ్నల్లు, లైటింగ్ను ప్రభావితం చేస్తోంది, దీనివల్ల రైల్వే ఆపరేషన్లకు అడ్డంకులు వస్తున్నాయి.
Delhi Viral Video : दिल्ली का एक मात्र रेलवे स्टेशन, जहां बने हैं लोगों के घर | Azadpur Railway Station#DelhiNews #AzadpurRailwayStation #Azadpur #LatestNews #HindiNews #Trending #ViralVideo #ViralControversy pic.twitter.com/sxfJ2X3ANu
— Viral Controversy (@ViralControVC) November 4, 2025
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో ప్లాట్ఫామ్పై ఇళ్లు, షాపులు, కుటుంబాలు గడిపేస్తున్నాయి. "రైల్వే ప్లాట్ఫామ్ కాదు, ఓ పూర్తి కాలనీ" అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఢిల్లీలో అక్రమ ఆక్రమణలపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ డ్రైవ్ నడుపుతోంది. ఆజాద్పూర్లో కొంతమంది నివాసులకు నోటీసులు ఇచ్చారు, కానీ పూర్తి రిమూవల్ జరగలేదు. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఆక్రమణలు 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, సురక్షిత పునరావాసం కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Is the government & railway minister sleeping 😴 💤 Have U seen anything like this?
— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) November 3, 2025
This is Azadpur rly station the only platform of the country where people are living on platform have shops
U find children playing
U have to be very careful about ur mobile & other belongings pic.twitter.com/Fs2ObZD0A1
ఢిల్లీ ప్రభుత్వం స్లమ్కు ఇల్లు పథకాన్ని ప్రస్తావిస్తోంది, కానీ నివాసులు "మేము పేదలం, ముందు పునర్వాసం ఇవ్వాలి" అంటున్నారు. రైల్వే అధికారులు ఈ ప్రాంతంలో సిగ్నల్లు, ట్రాక్ మెయింటెనెన్స్కు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.





















