అన్వేషించండి

Ayodhya: అయోధ్యను చూస్తే ఔరా అనాల్సిందే.. ఇదే గ్రాండ్ ప్లాన్!

చారిత్రక శిల్పకళా వైభవాన్ని, అధునాతన కట్టడాల నైపుణ్యాన్ని కలిపి అయోధ్యను ప్రపంచస్థాయి పర్యటక నగరంగా మార్చే మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అందులో చెప్పిన విశేషాలు వింటే ఔరా అనాల్సిందే..

అయోధ్య.. రాముడి జన్మస్థలం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అయోధ్యకు పూర్వవైభవం తీసుకురావాలని, ప్రపంచంలోనే ప్రముఖ పర్యటక ప్రదేశంగా మార్చాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే ఒక గ్రాండ్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ఇటీవల మోదీ ఈ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్లాన్ లో కళ్లుచెదిరే విశేషాలు ఉన్నాయి. సుందర వనాలు, అందమైన ఘాట్ లు, చెరువులను అభివృద్ధి చేసి ప్రకృతి రమణీయంగా అయోధ్యను తీర్చిదిద్దనున్నారు. 

  1. 14 ఏళ్ల పాటు రాముడి చేసిన అరణ్యవాసంలో ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టేలా తీర్చిదిద్దనున్నారు.
  2. అయోధ్య చుట్టూ 65 కిమీ మేర రింగ్ రోడ్డు నిర్మాణం.
  3. సనాతన ధర్మానికి అనుగుణంగా గొప్ప ఆధ్యాత్మిక, పర్యటక నగరంగా అయోధ్యను తయారు చేయడం.
  4. వాయు, నీటి కాలుష్యరహితంగా నగరాన్ని తీర్చిదిద్దడం. 
  5. 'చారిత్రక గొప్పతనం, ప్రస్తుత అవసరం, భవిష్యత్ కోసం నిర్మాణం' అనే థీమ్ తో ప్రభుత్వం నగర నిర్మాణం చేపట్టనుంది.
  6. 'ప్రపంచ తొలి స్మార్ట్ వేదిక్ సిటీ'గా అయోధ్యను తయారు చేయనుంది.

డ్రీమ్ ప్రాజెక్ట్ లు..

మౌలిక సదుపాయాలు..

ఈ ప్లాన్ లో ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ లలో ఒకటి 'మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం'. అయోధ్యకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్ ను నిర్మించాలని చూస్తున్నారు. అయోధ్యకు వచ్చే దారులన్నీ కలిపి 4 నుంచి 6 లేన్లుగా మార్చనున్నారు. శ్రీరామ మందిర ఖ్యాతిని తెలియజేసేలా అతిపెద్ద ద్వారాలతో అయోధ్యకు 6 ప్రధాన ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. త్వరలోనే 65కిమీ పెద్ద రింగ్ రోడ్డు పనులను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్ హెచ్ ఏఐ) ప్రారంభించనుంది.

సుందరీకరణ పనులు..

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో జంతారా వద్ద సరయూ నదీ తీరంలో 'రామ స్మృతి వనం' నిర్మించనున్నారు. ఇందులో పూర్తిగా పాదచారులకే ప్రవేశం ఉంటుంది. సీతా, లక్ష్మణ సమేతంగా రాముడి చేసిన వనవాస విశేషాలను ఇందులో ప్రత్యేకంగా చూపిస్తారు. దీనితో పాటు దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో  ఒక వేద పట్టణాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆశ్రమాలు, 5 స్టార్ హోటల్స్, దేశవిదేశాల నుంచి వచ్చే వారు ఉండటానికి విదేశీ, రాష్ట్ర భవనాలు నిర్మించనున్నారు. ఈ టౌన్ షిప్ లో సౌర, విద్యుత్ వాహనాలే నడవనున్నాయి. దీనికి మధ్యలో రామ మందిర గుమ్మటాన్ని పోలి ఉండేలా బ్రహ్మ స్థానాన్ని కట్టనున్నారు.

అత్యాధునిక వసతులు..

208 ఆధ్యాత్మిక ప్రదేశాలతో ప్రపంచస్థాయి పంచకోశీ మార్గాన్ని అయోధ్య చుట్టూ ఏర్పాటు చేయనున్నారు. ఇందులోనే ఘాట్ లు, కొలనులు, వినోద, ఆధ్యాత్మిక ప్రాంతాలను తీర్చిదిద్దనున్నారు. సరయు నది వద్ద దీపావళి పండుగకు ఈ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వ్యవస్థ, 6 మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణాలు చేయనున్నారు.

30 వేల మంది యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వగలిగే ధర్మశాలలు నిర్మించనున్నారు. సరయు నది ఘాట్ లు, జానకీ ఘాట్ లను కేంద్ర పర్యటక శాఖ ద్వారా స్వదేశీ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. రామ కథ మ్యూజియంను ప్రపంచస్థాయి డిజిటల్ మ్యూజియంగా మార్చనున్నారు.
 
ఒక్కసారైనా..
 
ఈ ప్రాజెక్ట్ లను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. రాముని ఆదేశాల ప్రకారం రామసేతువు ఎలా నిర్మితమైనదో.. అలానే రాముడి ఆశీస్సులతో అయోధ్య అభివృద్ధి సైతం అలానే జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తోంది. భవిష్యత్తు తరాలు.. తమ జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను చూడాలనుకునేలా నగరాన్ని మారుస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పారు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget