By: Ram Manohar | Updated at : 02 Apr 2023 11:37 AM (IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. (Image Credits: ANi)
Covid 19 Cases:
మళ్లీ అలజడి..
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా అలజడి మొదలైంది. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలందరూ మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 3,824 కేసులు నమోదయ్యాయి. ఆర్నెల్లలో ఇదే అత్యధికం. మార్చి 31వ తేదీన 3,095 కేసులు నమోదయ్యాయి. అవే ఎక్కువ అనుకుంటే...ఇప్పుడా రికార్డునీ అధిగమించి కేసులు పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేస్లు 18,389గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా అక్కడ 416 మంది కరోనా బారిన పడ్డారు. గత 7 నెలల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 14.37%గా ఉంది. కరోనా సోకి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 26,529గా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ తరవాత ఆ స్థాయిలో మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నాయి. ముంబయిలో కొత్తగా 347 మంది కరోనా బారిన పడ్డారు.
India reports 3,824 new cases of Covid-19 in 24 hours; the active caseload stands at 18,389. pic.twitter.com/i4AOCyHAj3
— ANI (@ANI) April 2, 2023
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కేసుల కలవరం మొదలైంది. ఆ మధ్య ఉన్నట్టుండి పెరిగి తగ్గిపోయినా...ఇప్పుడు మళ్లీ అలజడి సృష్టిస్తోంది ఈ వైరస్. ముఖ్యంగా XBB.1.16 కొవిడ్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసుల్లో 48% వాటా వీటిదే. ఈ వేరియంట్తో పాటు మరి కొన్ని వేరియంట్లూ వ్యాప్తి చెందుతున్నా...ప్రభావం అయితే తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు.
"ప్రస్తుతానికి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 4-5 రోజుల్లో ముగ్గురు చనిపోయారు. వాళ్లు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారు. ఏదేమైనా అప్రమత్తంగా ఉంటాం. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. కొత్త వేరియంట్లను ముందుగానే గుర్తించడమే ప్రభుత్వం లక్ష్యం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
ఢిల్లీవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ కొవిడ్ మాక్ డ్రిల్స్పైనా ఈ సమావేశంలో చర్చించారు కేజ్రీవాల్. ఇతర రాష్ట్రాలు పరిస్థితులను ఎలా కంట్రోల్ చేస్తున్నాయో గమనించాలంటూ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఇన్సకాగ్ చెబుతున్న వివరాల ప్రకారం...దేశంలో ఒక్కసారిగా కేసులు పెరగడానికి కారణం...XBB.1.16 వేరియంట్. 9 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో అత్యధికంగా 105, తెలంగాణలో 93, కర్ణాటకలో 61, గుజరాత్లో 54కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ...ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని AIIMS డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. వైరస్ మ్యుటేషన్ అవుతున్నంత కాలం ఇలాంటి వేరియంట్లు వస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. XBB.1.16 వేరియంట్ ఈ ఏడాది జనవరిలో తొలిసారి బయటపడింది.
Also Read: Rahul Gandhi: లీగల్ ఫైట్కు సిద్ధమైన రాహుల్,కోర్టు తీర్పుని సవాలు చేస్తూ త్వరలోనే పిటిషన్!
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gold-Silver Price Today 07 June 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Group1: గ్రూప్-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్ల రికార్డులు ఎలా ఉన్నాయి?