అన్వేషించండి

Independence Day Celebration: కరోనా ఉంది జాగ్రత్త, పెద్ద ఎత్తున గుమిగూడకండి - రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

Independence Day Celebration: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని కేంద్రం సూచించింది. కేసులు పెరుగుతున్నందున గుమిగూడొద్దని తెలిపింది.

Independence Day Celebration:

అది రాష్ట్రాల బాధ్యతే..

దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. సంఖ్యగా చూస్తే స్వల్పంగానే కనిపిస్తున్నా...ఇది ఉన్నట్టుండి ఉద్ధృతమైతే మరో ముప్పు తప్పదేమో అని కలవర పడుతోంది కేంద్రం. కొవిడ్ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాలకు ఆదేశాలిచ్చింది. స్వాతంత్య్ర వేడుకలు సమీపిస్తుండటం వల్ల కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. స్వాతంత్య్ర వేడుకల్లో అందరూ తప్పనిసరిగా కొవిడ్ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. దేశవ్యాప్తంగా రోజూ కనీసం 15 వేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. "ముందు జాగ్రత్త చర్యగా, స్వాతంత్ర్య దినోత్సవాల్లో పెద్ద ఎత్తున గుమికూడటం లాంటివి చేయకూడదు. కొవిడ్ గైడ్‌లైన్స్‌ని పాటించటం చాలా కీలకం" అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ "స్వచ్ఛ భారత్" కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపింది. రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నెల రోజుల పాటు తమ ప్రాంతాల్లో "స్వచ్ఛ" కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. పర్యావరణ సంరక్షణలో భాగంగా అందరిలో అవగాహన పెంచేలా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మొక్కలు నాటాలని సూచించింది. 

దిల్లీలో మాస్క్ తప్పనిసరి..

24 గంటల్లో భారత్‌లో 16,561 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది మృతి చెందారు. ఈ మృతుల్లో 10 మంది కేరళకు చెందిన వారే. ప్రస్తుతానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 42 లక్షల, 23వేల 557కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించింది. ప్రస్తుతానికి 1,23,535 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 26 వేల 928కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.28%కాగా, రికవరీ రేటు 98.53%గా ఉంది. 24 గంటల్లోనే యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,541 మేర తగ్గింది. డెయిలీ పాజిటివిటీ రేటు 5.44%కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.88%గా నమోదైంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే..దిల్లీలో ఓ కీలక నిబంధనను మరోసారి అమల్లోకి తీసుకొచ్చారు. మాస్క్‌ తప్పనిసరి చేశారు. పబ్లిక్ ప్లేసెస్‌లో మాస్క్ ధరించని వాళ్లకు రూ.500 జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్ ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి దిల్లీ కొవిడ్‌ హబ్‌గా మారింది. మహారాష్ట్ర తరవాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో తొలిసారి "మాస్క్" నిబంధన తీసుకొచ్చింది దిల్లీలోనే. ఇప్పుడు మరోసారి ఇక్కడే కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్యే కొవిడ్ కేసులు తగ్గాయని మాస్క్ నిబంధనను తొలగించింది కేజ్రీవాల్ సర్కార్. ఇప్పుడు మళ్లీ తప్పనిసరి చేసింది. నిత్యం కొవిడ్‌ మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉంది దిల్లీ ప్రభుత్వం. అయితే...ఈ సారి కరోనాతో పాటు మంకీపాక్స్‌ కేసులూ నమోదవుతుండటం వల్ల ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే దిల్లీ రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

Also Read: TDP YCP In BJP Trap : వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !

Also Read: ఈ బజారులో భర్తను కొనుక్కోవచ్చు, 700 ఏళ్లుగా ఇదే ఆచారం - ఎక్కడో కాదు ఇండియాలోనే!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget