అన్వేషించండి

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Kejriwal on Modi Degree: అరవింద్ కేజ్రీవాల్‌ ప్రధాని క్వాలిఫికేషన్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Kejriwal on Modi Degree:


ప్రెస్‌మీట్ పెట్టిన కేజ్రీవాల్ 

ప్రధాని క్వాలిఫికేషన్‌పై అరవింద్ కేజ్రీవాల్‌  పిటిషన్ వేయడాన్ని ఖండించిన గుజరాత్ హైకోర్టు ఆయనకు జరిమానా కూడా విధించింది. ఈ ఆరాలు అనవసరం అని తేల్చి చెప్పింది. దీనిపై ఇప్పటికే మండి పడిన కేజ్రీవాల్ మరోసారి ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని ఏం చదివారో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉందని తేల్చి చెప్పారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి చదువుకోవడం చాలా కీలకం అని అన్నారు. లేదంటే అధికారులు తప్పుదోవ పట్టించే ప్రమాదముందని తెలిపారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి సరైన విద్యార్హతలు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. 

"ప్రధాని స్థాయి వ్యక్తి కచ్చితంగా చదువుకునే ఉండాలి. అందుకు తగ్గ విద్యార్హతలు ఉండాలి. ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయన చేతుల్లోనే ఉంటుంది. చదువుకోలేదంటే అధికారులు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది. ప్రధాని మోదీ క్వాలిఫికేషన్‌ చూపించకపోవడానికి కారణమేంటి..? మొత్తం దేశమంతా ఇదే ప్రశ్న వేస్తోంది"

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

గుజరాత్ హైకోర్టు తీర్పు షాకింగ్‌గా ఉందన్న కేజ్రీవాల్, ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని విద్యార్హతలు తెలుసుకునే హక్కు అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు. 

"ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలేంటో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు అన్నట్టుగా ఉంది గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. నాకు షాకింగ్‌గా కూడా ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో కావాల్సిన వివరాలు తెలుసుకునే హక్కు అందరికీ ఉంటుంది. చదువుకోకపోవడం నేరమేం కాదుగా. పేదరికం కారణంగా చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. 75 ఏళ్లలో భారత్‌ అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేదు. దేశం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరముంది" 

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

ప్రధాని మోదీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ఈ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ద్వారా ఈ వివరాలు బయట పెట్టాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇది అనవసరమైన విషయం అని వెల్లడించింది. అంతే కాదు. ఈ పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది గుజరాత్ హైకోర్టు. ఈ మేరకు ఈ జరిమానాను గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిజానికి 2016లోనే సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్..గుజరాత్ యూనివర్సిటీకి సూచనలు చేసింది. ప్రధాని మోదీ విద్యార్హతలేంటో చెప్పాలని అడిగింది. దీనిపైనే విచారణ చేపట్టిన కోర్టు..ఆ అవసరమే లేదంటూ స్పష్టం చేసింది. 

Also Read: Howrah Violence: హింసాత్మకంగా మారిన నవమి వేడుకలు, బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ వార్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
Best Safety Cars in India: రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులుకర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
Best Safety Cars in India: రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Chandra Babu: అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
Devara AP Ticket Rates: ‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
Embed widget