By: ABP Desam | Updated at : 16 Mar 2022 04:31 PM (IST)
ఇదేంది స్వామీ ? చెప్పే ప్రవచనాలు కూడా వివాదాలేనా ?
చినజీయర్ స్వామి. ఇటీవలి కాలంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చిన ఆధ్యాత్మి స్వామి. రాజకీయ నాయకులతో ఆయన సంబంధాలు.. ఆయన వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. ఆయన ప్రసంగాలు కూడా అంతే. ఇప్పుడు సమ్మక్క- సారక్కలపై అనుచిత వ్యాఖ్యలతో మరోసారి విమర్శల పాలవుతున్నారు. ఆ వ్యాఖ్యలు ఎప్పుడో చూసి ఉండవచ్చు..కానీ అలాంటివి చేయడం మొదటి సారి కాదు. అందుకే ఈ సారి ఆయనపై ఎప్పుడూ లేనన్ని విమర్శలు వస్తున్నాయి.
అధ్యాత్మిక వేత్తగా చినజీయర్ ప్రవచనలు చెబుతూంటారు. ఇటీవల ఆయన ప్రజల ఆహారపుటలవాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంసాహారులు ఏ జంతువును ఆహారంగా తీసుకుంటారో ఆ జంతువులా ప్రవర్తిస్తారన్నారు. పంది మాంసం తింటే పంది ఆలోచనలు, మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుక తింటారని ఆయన ఉదాహరణలతో సహా చెప్పారు. ఈ విషయం దుమారం రేపింది. ప్రజల ఆహారపుటలవాట్లను ప్రశ్నించడానికి ఆయనెవరని పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ కొన్ని సంఘాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశాయి. అయితే తర్వతా ఆ వివాదం సద్దుమణింగి.
సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కస్తున్న సమయంలో కులాల గురించి వ్యాఖ్యలు చేసారు. కులాలను నిర్మూలించకూడదని, ఎవరి కుల వృత్తిని వారు కొనసాగించాలని ఓ సందర్భంలో ప్రవచించారు. అసలు కుల, మతాలు లేని సమానత్వాన్ని బోధిస్తూ సమతావిగ్రహం పెడుతూ.. కులాలు ఉండాలని చినజీయర్ చెప్పడేమింటని విమర్శలు వెల్లువెత్తాయి. చినజీయర్ పలికిన మాటలు మధ్య యుగం కాలంలో చెల్లుబాటు అయ్యాయన్న విమర్శలు వచ్చాయి.
తిరుపతికి వెళుతుంటే ఓ క్లబ్కు వెళుతున్నట్టుగా ఓ భావన కలుగుతుందంటూ గతంలో ఓ సారి చినజీయర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రోమ్ నగరాన్ని సందర్శనకు వెళ్లితే రోమ్ సంస్కృతి ఉట్టిపడినట్టుగా ఓ భావన కలుగుతుందని, కానీ తిరుపతికి వెళితే ఓ క్లబ్కు వెళుతున్నామనే భావన కలుగుతుందంటూ భక్తి కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన అగ్రహానికి కారణం గతంలో కొండపై తాను అనుకున్నట్లుగా వ్యవహరించలేదని.. తన పెత్తనానికి అంగీకరించలేదన్న కారణంగా అలాంటి వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
చినజీయర్ స్వామి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశం మొత్తంలో పెద్దగా పరిచయం అవసరం లేని ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. నిజానికి అనేక దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, రాజకీయ, సామాజిక రంగాలలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. అలాగే, ఆయన చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి, వివాదాస్పద రాజకీయ స్వామీజీగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి. చిన జీయర్ స్వామి.. సర్కార్ స్వామిగానూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఎదుర్కుంటున్నారు. ఆయన చేపట్టే కార్యక్రమాల వెనుక కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలు ఉంటాయని సీపీఐ నేత నారాయణ లాంటి వారు తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు.
నిజానికి ఆయన ఇప్పటి వరకూ మాట్లాడిన మాటలపై పెద్దగాఎవరూ వివాదం చేయలేదు. కానీ ఇటీవల మాత్రం ఎవరూ ఊరుకోవడం లేదు. ఆయన మాటలపై నిరసనలు ప్రారంభిస్తున్నారు. దీంతో మరింత వివాదాస్పదం అవుతున్నారు.
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
MLC Kavitha: జూన్ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత
SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Airtel Network Issue: ఎయిర్టెల్ వినియోగదారులకు నెట్వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!