అన్వేషించండి

China Covid Deaths: కొవిడ్ మరణాలపై ఈ వివరాలు సరిపోవు, మరింత సమాచారం ఇవ్వండి - చైనాతో WHO

China Covid Deaths: చైనాలో కొవిడ్ మరణాలపై మరిన్ని వివరాలు కావాలని WHO అడిగింది.

WHO on China Covid Deaths:

60 వేల మంది మృతి..

కొవిడ్‌ లెక్కల్ని చైనా దాస్తోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో డ్రాగన్ కీలక విషయం వెల్లడించింది. జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక దేశంలో కొవిడ్ మరణాలు పెరిగాయని అంగీకరించింది. డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని నివేదించింది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ హెల్త్ కమిషన్ ఈ లెక్కలు వెల్లడించింది. అయితే...ఇవి కేవలం మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న చోట రికార్డ్‌ చేసిన మరణాలు మాత్రమేనని, వాస్తవంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ లెక్క తేలలేదని తెలిపింది. ఈ 60 వేల మరణాల్లో దాదాపు 5 వేల మందికి పైగా బాధితుల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని చైనా వివరించింది. ఇవి డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య కాలంలో నమోదైన మరణాలని చెప్పింది. ఇన్నాళ్లు కొవిడ్ మరణాల విషయంలో చైనా సరైన విధంగా లెక్కలు వెలువరించ లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ వివరాలు వెల్లడించింది. అయితే..దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఈ మరణాలపై మరిన్ని వివరాలు అందజేయాలని చైనాను కోరింది. పూర్తి స్థాయిలో కరోనా పరిస్థితులను అంచనా వేయాలంటే ఆ వివరాలు అవసరం అని వివరించింది.  

మందులకూ కొరత..

గత నెల జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసినప్పటి నుంచి కేసులు దారుణంగా పెరుగుతూ వస్తున్నాయి.  ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు. రోజుల పాటు వెయిట్ చేస్తే తప్ప ఆసుత్రిలో చికిత్స అందని దుస్థితి. ఇక కొవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలు చేయాలన్నా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొవిడ్ మందులకూ కొరత ఏర్పడింది. కొందరు మెడికల్‌షాప్ వాళ్లతో ముందుగానే మాట్లాడుకుని ఒకేసారి పెద్దమొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా...మిగతా వాళ్లకు అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే...చైనా మరో వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది. mRNA టీకా టెస్టింగ్ దశలో ఉంది. బూస్టర్ డోస్ కింద ఈ టీకాను అందించనున్నారు. CS-2034 వ్యాక్సిన్‌ ప్రత్యేకించి ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్స్‌ను అంతం చేసేందుకేనని చైనా చెబుతోంది. ప్రస్తుతం అక్కడ ఈ వేరియంట్స్‌తోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే..చైనా కొవిడ్ కేసుల విషయంలో ఇస్తున్న సమాచారం సరిగా ఉండడం లేదని ఇటీవలే WHO అసహనం వ్యక్తం చేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్‌లను మాత్రమే ఇస్తోందని, మ్యుటేషన్‌లు, వేరియంట్‌లు, కొవిడ్ కేసుల సంఖ్య లాంటి వివరాలను అందించడం లేదని చెబుతోంది. ఇప్పటికే WHO ప్రతినిధులు చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ వేరియంట్‌ ఎక్కువగా సోకుతోంది..? ఆసుపత్రుల్లో సరిగా చికిత్స అందుతోందా లేదా..? జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా కొనసాగుతోంది..? ఇలా అన్ని విషయాలనూ ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. "ఈ వివరాలు కచ్చితంగా ఉంటేనే కరోనాపై పోరాడం సులువవుతుంది" అని WHO స్పష్టం చేసింది. పలు దేశాల్లో ఈ  డేటా సరిగ్గా ఉండటం వల్ల కొంత వరకూ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలైందని గుర్తు చేసింది. 

Also Read: Nepal Aircraft Crash:నేపాల్‌లో ఘోర ప్రమాదం, రన్‌వేపై క్రాష్ అయిన విమానం - ఫ్లైట్‌లో 72 మంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Ratan Tata Death Reason: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Embed widget