అన్వేషించండి

Center statement on fuel issue: కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన

Petrol shortage: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇంధన సరఫరాపై తలెత్తిన ఆందోళనలతో స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

Centre clarification on petrol shortage:  రెండు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలు, ఇంధన కొరతపై నెలకొన్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి   సుజాతా శర్మ మీడియా ద్వారా దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

భారత్‌లో కావాల్సినంత ఇంధన నిల్వలు 

భారతదేశానికి ఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే  సామర్థ్యం ఉందని సుజాతా శర్మ గుర్తుచేశారు. ఈ సామర్థ్యం మన దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని నిరంతరాయంగా అందించగలదని ఆమె పేర్కొన్నారు. పెట్రోల్ బంకులకు ఇంధనాన్ని సరఫరా చేసే టెర్మినల్స్‌లో కూడా తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా గొలుసులో ఎలాంటి ఆటంకాలు లేవని ఆమె వివరించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, క్షేత్రస్థాయిలో కొరత ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

పానిక్ బయింగ్ వల్లే సమస్య 

గత రెండు రోజులుగా చాలా ప్రాంతాల్లో రిటైల్ అవుట్‌లెట్ల వద్ద ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండటం,  పానిక్ బయింగ్ అంటే భయంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడంకు దిగడం వల్లే కొన్ని చోట్ల తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం గుర్తించింది. అవసరం లేకపోయినా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని, దీనిని కొరతగా భావించి మరింత ఆందోళన చెందవద్దని సుజాతా శర్మ కోరారు. పుకార్లను నమ్మి బంకుల వద్ద రద్దీ పెంచవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ధరల పెంపు లేదు 

ఇంధన ధరలు పెరగబోతున్నాయనే వార్తలపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ఏదీ లేదని, పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ధరల పెంపు భయంతో కూడా చాలా మంది స్టాక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్రం సూచించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ, దేశీయంగా వినియోగదారులపై భారం వేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రాలకు ఆదేశాలు 

తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచాలని, బంకుల వద్ద శాంతిభద్రతలను పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కొన్ని చోట్ల ఆయిల్ కంపెనీలు బంకుల నుంచి నగదు ముందస్తుగా వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించారు. నిరంతరాయంగా సరఫరా జరిగేలా ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని, ప్రజలు సంయమనం పాటించాలని కేంద్రం కోరింది.

కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో పెట్రోల్ మంటలకు కొంతమేర ఉపశమనం లభించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో బంకుల వద్ద నిల్వలు వేగంగా నింపేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం ఇప్పుడు అధికారుల ముందున్న సవాలు. నిరంతరాయంగా ఇంధనం అందుబాటులో ఉంటేనే ఈ ఆందోళనకర పరిస్థితులు సద్దుమణుగుతాయి.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Center statement on fuel issue: కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
Best Affordable Bikes: 4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ
4 వేల కంటే తక్కువ EMI తో బైక్ కొనేయండి.. బడ్జెట్ ధరలో టూవీలర్స్ ఇవీ
Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Advertisement

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Kichcha Sudeep : కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Harish Rana Biopic: హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
Embed widget