అన్వేషించండి

15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ, ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న ప్రగతి భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో...పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న ప్రగతి భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో...పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు జరగనున్నాయ్. వర్షాకాల సమావేశాలు ముగిశాక నవంబరు మూడోవారం తర్వాత శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగియగా 40 రోజుల్లోపే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వేర్వేరు వర్గాలు భిన్న అంచనాలు వేస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికి పార్లమెంటును సమావేశపరుస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉమ్మడి పౌరస్మృతి (ucc) అమలు, ఓబీసీ వర్గీకరణకు జస్టిస్‌ రోహిణి కమిషన్‌ చేసిన సిఫార్సుల ఆమోదం వంటివి చర్చించడానికేనని మరికొందరు చెబుతున్నారు. సమావేశాలను కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహించే అవకాశం ఉంది. 

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతురన్న చర్చ జరుగుతోంది. పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగంలో కనీసం అయిదు అధికరణలను సవరించాలి. రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తీసుకోవాలి. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సేకరించాలి. వీటన్నంటిపై నిర్ణయం తీసుకోవడానికే పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో అరుణాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, హరియాణాల్లోనూ అసెంబ్లీల గడువు ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటితో సంప్రతింపులు చేపట్టి, లోక్‌సభతోపాటే ఈ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలనూ నిర్వహించే అవకాశముంది. 

జీఎస్టీని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వ హయాంలో 2017 జూన్‌ 30న పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ప్రత్యేకంగా అర్ధరాత్రి సమయంలో నిర్వహించారు. ఈసారి మాత్రం అలా కాకుండా పూర్తిస్థాయి సమావేశాల తరహాలో ఐదురోజులపాటు సభలు జరగనున్నాయి. ప్రధాని మోదీ 73వ పుట్టినరోజు మర్నాడే ఇవి మొదలవుతున్నాయి. గతంలో స్వాతంత్య్ర రజతోత్సవాలు/ స్వర్ణోత్సవాలు, క్విట్‌ఇండియా 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

మోదీ చాలీసా వినడానికి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడం లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.  అదానీ గ్రూప్‌, ఆర్థిక వ్యవహారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, మణిపుర్‌ అల్లర్లు తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకటించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget