అన్వేషించండి

Breaking News: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది- దేవుడి దర్శనానికి కూడా అనుమతి లేదు: జగన్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూ వివాదం, జగన్ తిరుమల టూర్‌పై రగడ నడుస్తుండగానే తెలంగాణలో మంత్రి ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది. వీటిపై తాజా సమాచారాన్ని ఇక్కడ చూడండి.

LIVE

Key Events
Breaking News: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది- దేవుడి దర్శనానికి కూడా అనుమతి లేదు: జగన్

Background

తిరుమల లడ్డూతో  మొదలైన వివాదం మరింత ముదురుతోంది. ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలకు పిలుపునిచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం తిరుపతి వెళ్తున్నారు. ఆయన స్వయంగా తిరుమలేశుడి దర్శించుకొని వస్తారు. గతంలో చాలాసార్లు ఆయన తిరుపతి వెళ్లి వచ్చినా ఈసారి పర్యటన మాత్రం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. 

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలవడంలో జగన్ వల్లే జరిగిందని ప్రత్యర్థులు నమ్మడం, ప్రచారం చేయడంతో ఓవర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది. దీనికి తోడు పవన్ కల్యాణ్ పెట్టిన ప్రెస్‌మీట్ కూడా కాకరేపింది. ఇంత జరిగినా హిందువులకు బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నలు సంధించడంతో హిందూ స్వామీజీలు ఏకమై ఇప్పుడు జగన్ టూర్ అడ్డుకుంటామని సవాళ్లు చేస్తున్నారు. 

మరోవైపు తిరుమలలో ఎన్డిఏ కూటమి అనవసరమైన రాద్దాంతం చేస్తోందని అన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. డిక్లరేషన్ విషయంలో కూడా ఎప్పుడూ లేని వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు. అసలు డిక్లరేషన్ ఇవ్వకపోయినా దర్శనానికి అనుమతివ్వకూడదనే రూల్ లేదని అన్నారు. దీనిపై స్వామీజీలు మండిపడుతున్నారు. ఎన్డీఏనేతలు కూడా డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.  

ఇలా ఇరు వర్గాలు ఎవరికి నచ్చిన వాదన వాళ్లు చేస్తున్నారు. మరోవైపు సాయంత్రం జరిగే టూర్‌లో ఎలాంటి హడావిడి చేయొద్దని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో దేవుణ్ని దర్శించుకుంటానంటూ చెప్పుకొచ్చారు. 

పరిస్థితి కాస్త హాట్ హాట్‌గా ఉండటంతో పోలీసులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. అక్టోబర్ 24 వరకూ ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎవరూ సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించొద్దని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

15:44 PM (IST)  •  27 Sep 2024

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: జగన్

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తామంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తున్న పరిస్థితులు ఎప్పుడూ దేశంలో జరిగి ఉండదు. వైసీపీ కార్పొరేటర్లకు, వైసీపీ నాయకులకు, వైసీపీ శ్రేణులకు నోటీసులు ఇవ్వడం 

15:29 PM (IST)  •  27 Sep 2024

Bangladesh Vs India Test Match: మొదటి రోజు ముందుగానే నిలిచిపోయిన కాన్పూర్ టెస్టు

India Vs Bangladesh 2nd Test: కాన్పూర్‌లో భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ముందుగానే ఆటను ఆపేశారు. మొదటి రోజు ఆట నిలిచిపోయే వరకు 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ 107 పరుగులు చేసింది. ప్రస్తుతం ముష్ఫికర్‌ రహీమ్‌ ఆరు పరుగులతో, మొమినుల్‌ హక్‌ 40 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ తరఫున ఆకాశ్‌ దీప్‌ 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. 

14:44 PM (IST)  •  27 Sep 2024

మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు

Jagan Tirumala Tour: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడనున్నారు.

13:55 PM (IST)  •  27 Sep 2024

Telangana News: ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్ల విరాళం

Reliance Foundation Donated Rs. 20 crores to Telangana Chief Minister's Relief Fund : ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది.  ఇవాళ సీఎంతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు రూ.20 కోట్లు విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ ను పిఎంఎస్ ప్రసాద్, పి వి ఎల్ మాధవరావు అందజేశారు. 

13:49 PM (IST)  •  27 Sep 2024

Telangana News : రేవంత్ రెడ్డితో చెస్ ఒలంపియాడ్‌లో స్వర్ణ విజేతలు సమావేశం

FIDE Chess Olympiad gold winners meets Telangana CM: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని FIDE చెస్ ఒలంపియాడ్‌లో స్వర్ణ విజేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. స్వర్ణపతకాలు సాధించిన తెలంగాణ ఆటగాళ్లను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. భారతదేశం తరపున మొదటిసారి స్వర్ణ పతకాలను తెలంగాణ ఆటగాళ్లు అర్జున్ (హన్మకొండ) , ద్రోణవల్లి హారిక( ఖమ్మం) సాధించారు. ఇద్దరు ఆటగాళ్లకు చెరో రూ.25లక్షలు నగదు ప్రోత్సాహకం అందించారు సీఎం. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
JaganLatest Tweets: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Embed widget